Take a fresh look at your lifestyle.

రోశయ్య మృతి పట ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్బ్రాంతి

రోశయ్య మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆంధప్రదేశ్‌ ‌పూర్వ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్టాన్రికి దిశానిర్దేశం చేసిందని‘ ఆయన ట్వీట్‌ ‌చేశారు. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా రోశయ్య అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply