బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ఉప్పల్, హబ్సిగూడ డివిజన్ టీడీపి, బీజేపీ పార్టీ నాయకులు
ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: ఉప్పల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలోమంత్రి కండువా కప్పి పార్టీ లోని హబ్సిగూడ మాజీ ఉప సర్పంచ్, టీడీపీ మాజీ కౌన్సిలర్, ఉప్పల్ టౌన్ ప్రెసిడెంట్ వీ యాదగిరి , టీడీపీ మాజీ కౌన్సిలర్, స్టేట్ ఎస్టీ సెల్ సెక్రటరీ బానోత్ గోవర్ధన్ నాయక్ , టీడీపీ చిలుకనగర్ డివిజన్ ఇంచార్జ్ కోళ్ల రవికుమార్ గౌడ్ , బీజేపీ హబ్సిగూడ డివిజన్ జనరల్ సెక్రటరీ బానోత్ పండు నాయక్, చిల్కనగర్ డివిజన్ బీజేపీ నాయకులు ఓరుగంటి శ్రీనివాస్ గౌడ్ లను మంత్రి హరీష్ రావు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. వీరు గత 30 సంవత్సరం నుండి టీడీపీ పార్టీకి సేవలు అందిస్తు కేసీఆర్ పాలన, సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూబీఎల్ఆర్ నమ్మకం తో పార్టీ లోనికి వచ్చామనీ, బండారి లక్ష్మరెడ్డి ని అత్యధిక మెజార్టీ తో గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి కోసం భాగస్వామ్యం అవుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామరావు, గోల్లురి అంజయ్య,నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ బద్రిద్దిన్, పల్లె రాజకుమార్ గౌడ్ ఉప్పల్ మాజీ కౌన్సిలర్, పిల్లి నాగరాజు, మోతె రఘు తిరుపతి రెడ్డి, కొత్త రామారావు, వరుణ్, మనీష్ తదితరులు పాల్గొన్నారు.