హైదరాబాద్, అక్టోబర్ 6 : స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటిల బదిలీలను అక్టోబర్ 19 వరకు నిలిపి వేస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా టీచర్ల లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతుల తర్వాత బదిలీలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది బాలకిషన్ రావు వాదనలు వినిపించారు.