Take a fresh look at your lifestyle.

దౌలాపూర్ లో బీఆర్ఏస్,  కాంగ్రెస్ మధ్య స్వల్ప ఉద్రిక్తత

జగదేవపూర్, ప్రజాతంత్ర నవంబర్ 22: బీ ఆర్ యస్, కాంగ్రెస్ మధ్యన స్వల్ప ఉద్రిక్తతనెలకొన్న ఘటన జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో బీ ఆర్ యస్, కాంగ్రెస్ మధ్యన స్వల్ప ఉద్రిక్తత
 నెల కొనగా గజ్వెల్ నియోజకవర్గం లో బుధవారం నాడు కాంగ్రెస్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభకు కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు డీజే లు పెట్టుకొని డాన్సులు చేస్తుండగా బీ ఆర్ యస్ నాయకుడు, రాష్ట్ర యఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రచార రోడ్ షో  సందర్బంగా త్వరగా వెళ్లాల్సినఅవసరం ఉన్నదని బీ ఆర్ యస్ శ్రేణులు మండల నాయకులు కార్యకర్తలు అనగా. కాంగ్రెస్ నాయకుల మధ్య బీ ఆర్ యస్ నాయకులు స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం వలన బీ ఆర్ యస్ నాయకులు దౌలాపూర్ సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి చొరవ తో సముదాయనిచ్చారు.ఎన్నికలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి పోతుంటాయని మనం ఊర్లో ఉంటాం మనం అన్నదముల్లా కలిసి మెలసి ఉండాలని అన్నారు.

Leave a Reply