కలిసికట్టుగా పనిచేసి జైపాల్ యాదవ్ ను గెలిపించుకుందాం
ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 2 : కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు బలపరిచిన అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ ని గెలిపించుకోవాలని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. కడ్తాల మండలంలోని గానుగమర్ల తండా గ్రామపంచాయతీ పరిధిలోని కానుకబాయి తండ, గానుగుమర్ల తండాలలోని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. తమ అభ్యర్థి గెలుపు కొరకై ప్రతి ఒక్కరు కలిసికట్టుగా నడుం బిగించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, మండల ఉపాధ్యక్షులు లక్పతి నాయక్, డైరెక్టర్ సేవ్య నాయక్, ఉప సర్పంచ్ పాండు నాయక్, వార్డ్ సభ్యులు శ్రీను నాయక్, బీమాన్ నాయక్, టిక్ లాల్ నాయక్, సక్రు నాయక్, చందర్ నాయక్, రాజ్ కుమార్, మహేష్, వంశీ, జగన్, హరిలాల్, గోపాల్, ఫాండు, రమేష్, నరేష్, కోట పవన్, రవి, రాజు, మహేష్, అభి, శ్రీను, క్రిష్, లచ్చు, రాజు, శీనా, కిషన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.