Take a fresh look at your lifestyle.

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షిరాభిషేకం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి తలకొండపల్లి మండలం కేంద్రంలో బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్ధాల సమస్యకు భారత ప్రధాని మోదీ చొరవతో పార్లమెంట్లో మరియు రాజ్యసభలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదం తెలిపిన సందర్బంగా తలకొండపల్లి బిజెపి మహిళా మోర్చా నాయకురాలు జిల్లా నాయకురాలు బండి శాంతకుమారి, మండల అధ్యక్షురాలు విజయ, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శానామోని పాండు, పెరుమాళ్ళ రాజు, ఉప సర్పంచ్ పద్మ అనిల్ ముదిరాజ్, శ్రీను, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.

Leave a Reply