వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్ ను వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శివాజీనగర్లో అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు చంద్రశేఖర్ ప్రసాద్ కుమార్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్ మోహన్ రెడ్డి ట్రెస్ టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్రెడ్డి విధ పార్టీల నాయకులు వామపక్ష పార్టీల నాయకులు తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు చంద్రశేఖర్ ప్రసాద్ కుమార్లు మాట్లాడుతూ ఈ కరోనా సెంటర్ ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలకు భయంకరమైన ట్వంటి కరోనా వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.
వెంటనే ప్రభుత్వం ఇక్కడి నుంచి కరుణ ఐసోలేషన్ సెంటర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గర ప్రాంతంలో ఉన్న నోవోటెల్ హోటల్లో కాని ఎక్కడైనా ఏర్పాటు చేయాలని కోరారు. పటం చెరులో ఉన్న టిఆర్ఆర్ మెడికల్ కళాశాలలో కరొణ ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్రెడ్డి మాజీ మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి కోరతామని తెలిపారు. ఇక్కడ కరోనా సెంటర్ ఏర్పాటును నిరసిస్తూ రేపు అఖిలపక్షం బంద్ వికారాబాద్ బంద్ కు పిలుపునివ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేసి ఇకడి నుంచి కరోనా సెంటర్ తరలి వెళ్లేలా ఉద్యమించాలని సూచించారు.