పట్టాలకెక్కనున్న ఇళ్ల పట్టాల పంపిణీ
- లాక్డౌన్వేళ పేదలకు సర్కార్ శుభవార్త
- జూలై 8న పట్టాల పంపిణీకి ఆదేశాలిచ్చిన సిఎం జగన్
- పట్టా రాలేదని ఎవరూ ఫిర్యాదు లేకుండా కార్యక్రమం
- టెలిమెడిసన్కు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం
- అధికారులతో సక్షలో సిఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశనం
అమరావతి,మే 5: కరోనా కష్టకాలంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. లాక్డౌన్ వేళ సీఎం జగన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. గతంలో వాయిదా పడ్డ ఇళ్ల పట్టాల పంపిణీని పట్టాలకు ఎక్కించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జూన్ 7లోగా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశర చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత ఈ కార్యక్రమాన్ని ఉగాది రోజున చేపట్టాలని మొదటి నుంచి జగన్ సర్కార్ భావించింది. ఐతే అంతలోనే ఎన్నికల పక్రియ మొదలవడం..ఆరువారాలపాటు వాయిదా పడటం, ఆ తరువాతి పరిణామాల అనంతరం కరోనా లాక్డౌన్ అమల్లోకి రావటంతో ఇళ్ల పట్టాల పంపిణీ పక్రియ మూలన పడింది. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. పేదలకు భూ పంపిణీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదలందరికీ జులై 8న పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈలోగా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంకా లబ్దిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తులు తనకు వచ్చాయని జగన్ వెల్లడించారు. మరో 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాలు పెట్టాలన్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఇంటి పట్టా ఎవరికైనా లేదా? అని తాను అడిగితే.. లేదు అని ఎవ్వరూ అనకూడదన్నారు. తనకు ఓటు వేయని వారైనా పర్వాలేదు, వాళ్లకీ పట్టాలు ఇవ్వాల్సిందేనని జగన్ పేర్కొన్నారు. అర్హత ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇంటిపట్టా లేదని చెప్పకూడదన్నారు. 27లక్షల ఇళ్ల పట్టాలు మనం ఇవ్వబోతున్నామన్నారు. గ్రామాల్లోకి వెళ్లి నేను ఆరాతీస్తే.. ఇంటి పట్టా ఎవరికైనా లేదా? అని అడిగితే? లేదు అని ఎవ్వరూ అనకూడదని అన్నారు. నాకు ఓటు వేయని వారైనా పర్వాలేదు, వాళ్లకీ పట్టాలు ఇవ్వాల్సిందేనని సీఎం తేల్చిచెప్పారు.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 27లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. జిల్లాలు, మండలాల వారిగా మరోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు పెట్టి.. అర్హతల వివరాలు పెట్టండి అంటూ అధికారులకు సూచించారు.టెలి మెడిసిన్ కోసం ఒక నంబర్ కేటాయించామని జగన్ తెలిపారు. అలాగే ప్రతి సచివాలయంలో కూడా ముఖ్యమైన నంబర్లు ఉంచుతామన్నారు. ఈ నంబర్లు ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉండాలన్నారు. టెలిమెడిసిన్కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అధికారులు చెప్తున్నారన్నారు. కాల్చేసిన వారికి ప్రిస్కిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితోపాటు, కలెక్టర్కూ వస్తాయన్నారు. ఇక్కడ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. పీహెచ్సీ పరిధిలోకి ఒక ద్విచక్ర వాహనాన్ని, థర్మల్ బాక్సును అందుబాటులోకి తీసుకురావాలని జగన్ తెలిపారు. 24 గంటల్లోగా ప్రిస్కిప్షన్ ప్రకారం మందులు వెళ్లాలని సూచించారు. త్వరలో విలెజ్ క్లినిక్ ప్రారంభమవు తుందని.. అప్పుడు టెలీ మెడిసిన్ మరింత బలోపేతం అవుతుందన్నారు.
ఈ వ్యవస్థను కలెక్టర్లు తమదిగా భావించి బాగా పనిచేయించాలన్నారు. అలాగే రాష్ట్రం లోని అన్ని కుటుంబాలపై సమగ్రంగా సర్వే చేశామని.. వీరిలో అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించామని అన్నారు. ఇంకా 5,281 మందికి పరీక్షలు చేయాల్సి ఉందని జగన్ తెలిపారు. వీలైనంత త్వరగా వీరికి పరీక్షలు పూర్తి చేయాలన్నారు. కేందప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం… నిర్దేశిరచుకున్న కంటైన్మెంట్ క్లస్టర్లపై దృష్టి పెట్టాలన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్, దానిచుట్టూ ఉన్న బఫర్ జోన్పై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. వస్తున్న కేసులన్నీ కూడా క్లస్టర్ జోన్ల నుంచే అధికశాతం వస్తున్నాయని జగన్ వెల్లడించారు. రాష్ట్రంలోని పేదలందరికీ జులై 8న పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈలోగా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.