Take a fresh look at your lifestyle.

మైనార్టీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 7: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మైనార్టీల అభివృద్ధి సాధ్యపడుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాషా పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ శివారెడ్డిపేటకు చెందిన ఎక్బాల్ షాబీర్ సోదరులతో పాటు పలువురు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎక్బాల్ సోదరులను కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు హాజీ పాషా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలోని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉండగా మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి విద్యాభివృద్ధికి బాటలు వేసి ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తీరని మోసానికి గురి చేశారని పేర్కొన్నారు. మైనార్టీలంతా మరోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply