Take a fresh look at your lifestyle.

లక్షా యాబైవేల మెజారిటీ దిశగా మంత్రి హరీష్ రావుకు మద్దతు ప్రకటిస్తున్న గ్రామాలు కుల సంఘాలు

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2 : మంత్రి హరీష్ రావును లక్ష 50 వేల భారీ మెజార్టీతో గెలిపిస్తామని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ మాణిక్య రెడ్డి తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా ఉందని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలోని తుర్కకాశి సంఘం సభ్యులు, రామన్నపల్లి గ్రామ ప్రజలు మద్దతు తెలుపుతూ హరీష్ రావుకు ఓట్లు వేస్తామని తీర్మాన కాపీలు అందజేసినట్లు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, ఎంపీపీ మాణిక్య రెడ్డి  తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలందరూ తీర్మానం కాపీ ఇస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు రైతుబంధు ,రైతు బీమా, 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. కారు గుర్తు కే ఓటు వేస్తామని ప్రజలు అందరూ ముక్తకంఠంతో ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో రైతులకు  సాగునీరు, త్రాగునీరు, కరెంటుకు ఎన్నో ఇబ్బందులు ఉండేవని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక త్రాగునీరు, సాగునీరు, విద్యుత్ కు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.పార్టీకి ప్రజల అండదండలు ఉన్నట్లు తెలిపారు.  రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేస్తాం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నదని.. ఒకపక్క అభివృద్ధి మరొక పక్క రైతులకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర, ఎంపిటిసిల పోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, అల్లిపూర్ సొసైటీ చైర్మన్ సదానందం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంటయ్య,సర్పంచ్లు సుభాష్ గౌడ్ ,శ్రీనివాస్ ,బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply