• ఎదుటి వారి వ్యూహాలకు ధీటుగా మా వ్యూహాలు
• కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు
సనత్ నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29:ప్రత్యర్థిపక్షాల వ్యూహాలకు ధీటుగా మా వ్యూహాలు ఉంటాయి..ఎన్నికల వ్యూహాల రిపోర్టు వచ్చే వారం ఠాక్రే కు అందిస్తాం అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు అన్నారు.శుక్రవారం చిరాన్ ఫోర్ట్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సాగర్, ఈర్లపల్లి శంకర్, జంగయ్య యాదవ్, ఆడం సంతోష్ , రాకేష్ యాదవ్ లతో పాటు తదితర కమిటి సభ్యులు హాజరైనారు. ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ, ఇవాళ స్ట్రాటజీ కమిటీ మూడోవ సమావేశం జరుపుకున్నాం..
తప్పకుండా తమ బాధ్యత నెరవేరుస్తామనీ ..తెలంగాణలో తూఫాన్ లా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోందని..అని తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ హాయంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, వడ్ల కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ పార్టీ హాయంలోనే ఉన్నాయని, ప్రస్తుతం వడ్ల కొనుగోలులో పెద్ద స్కాం జరుగుతోందని ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వంలో మహిళల సాధికారత పూర్తిగా కుంటు పడిందని పేర్కొంటూ ఇందిరమ్మ ఇండ్లు తప్ప కెసిఆర్ కొత్తగా ఇచ్చిన ఇండ్లేమి లేవని ప్రజలే చెబుతున్నారని అన్నారు. కెసిఆర్ బంధులన్ని ఆగిపోయాయి, రాష్ట్రంలో వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 75 నుంచి 80 సీట్లు సాధిస్తుందని పేర్కొంటూ సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుందని తెలిపారు. రైతులకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్రంలో 22 లక్షల కౌలు రైతులు ఉన్నారు. .కెసిఆర్ ప్రభుత్వంలో కౌలు రైతులు మోసపోయారని తెలిపారు. తెలంగాణలో 54 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి.. కోటి ఎనభై లక్షల మంది పని చేసుకొని బతుకున్నారు. కెసిఆర్ వచ్చాక అందరూ రోడ్డున పడ్డారు అని ప్రేమ సాగర్ అన్నారు.
అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ యే నని…దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా అందిస్తాం అని హామీ ఇచ్చారు. డిసెంబర్ 10 లోపల పోలింగ్ పూర్తి అవుతుంది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలు అమల్లోకి వస్తాయి.. రాష్ట్రంలో కూని అవుతున్న ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీనే.. పార్టీ మా మీద పెద్ద భాధ్యత పెట్టింది.. మా బాధ్యతలు తప్పకుండా నిర్వర్తిస్తాం అన్నారు. వచ్చేవారం మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని రిపోర్ట్ అధిష్టానానికి అందిస్తాం. కచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నం. ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజలకు అవసరమయ్యే మ్యానిఫెస్టోను రూపొందిస్తాం. మేము వ్యవసాయం చేసే రైతులను ప్రగాఢంగా నముతాం. డిల్లీ వర్సెస్ తెలంగాణ అనే హక్కు కెసిఆర్ కు లేదు. పొత్తుల ద్వారా మేము కొంత దెబ్బ తిన్నాం. ఈ సారి పక్క ప్రాణాలికతో ప్రజల్లోకి వెళతాం. అవసరం అనుకున్న వారితో మాత్రమే పొత్తులు ఉంటాయి. కెసిఆర్ ప్రభుత్వంపై ప్రజలలు విశ్వాసం కోల్పోయారు.. కెసిఆర్ కు భయం పుట్టుకుందని, అందుకే వరస బెట్టి సభలు నిర్వహిస్తున్నారని, లెఫ్ట్ పార్టీలతో పొత్తులు అంశం అధిష్టానం చూసుకుంటది చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.