Take a fresh look at your lifestyle.

 ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి:జిల్లా కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 :  ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలనిమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం  జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా వివిధ సమస్యలపై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి  జిల్లా అదనపు కలెక్టర్ విజయంద్ర రెడ్డితో  కలిసి ప్రజల వద్ద నుండి (53) ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులు సకాలంలో పరిస్కరించాలని, దానివల్ల ఫిర్యాదుదారుకు మేలు కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఫిర్యాదుదారుకు ఫిర్యాదు పరిష్కారం అయింది, లేనిది స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయడంతో పాటు అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లా అధికారులు సైతం ప్రజావాణి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply