- కేసీఆర్ ఖేల్ ఖతం-బీఆర్ఎస్ దుకాన్ బంద్
- మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్
యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటేనని, ‘‘కేసీఆర్ ఖేల్ ఖతం-బీఆర్ఎస్ దుకాన్ బంద్’’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన డిక్లరేషన్పై కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే మంత్రిని ట్యాగ్ చేస్తూ రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ పోస్ట్ చేశారు. ట్వీట్ పూర్తి వివరాలను పరిశీలిస్తే…మా డిక్లరేషన్ దళిత-గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్. మా డిక్లరేషన్…1. దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు. 2. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు. 3. గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదు. 4. మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదు.
5. నేరెళ్ళ ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత-బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదు.6. దళిత – గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది కాదు. 7. దళిత మహిళ మరియమ్మను లాకప్ డెత్ చేయించడం లాంటిది కాదు. 8. ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకుని ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటిది కాదు. 9. ఎబిసిడి వర్గీకరణ చేయకుండా మోసం చేయడం లాంటిది కాదు. 10. దళితబంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తిపడే రాబందుల లాంటిది కాదు. అందుకే యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే ‘‘కేసీఆర్ ఖేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాన్ బంద్’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా మంత్రి కెటిఆర్కు కౌంటర్ ఇచ్చారు.