Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మైనారిటీలు మద్దతు ఇవ్వాలి

తాండూరు, ప్రజాతంత్ర నవంబర్ 2 : కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం మైనార్టీల మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మైనారిటీలను కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి డాక్టర్ సంపత్ కుమార్ తో కలిసి పట్టణంలోని పోలవరం మైనార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ పెద్దలతో మాట్లాడుతూ  కాంగ్రెస్ హాయాంలో మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వారి సంక్షేమం అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సారి కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఎన్నికల్లో గెలుపుకు తమ మద్దతును తెలిపి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని వారిని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ సాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్‌ అబ్దుల్ రజాక్, పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల నాయకులు బంటు మల్లప్ప తదితరులు ఉన్నారు.

Leave a Reply