Take a fresh look at your lifestyle.

తెలంగాణలో తగ్గుతున్న కొరోనా ఉధృతి

కొత్తగా మరో 3,527 పాజిటివ్‌ ‌కేసులు..19మంది మృతి
హైదరాబాద్‌,‌మే28: ‌తెలంగాణలో కొరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. 3,982 మంది కోలుకున్నారు.

19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసులు 5,71,044కు పెరిగాయి. వీరిలో 5,30,025 మంది కోలుకున్నారు. ఇంకా 37,793 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3226 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 97,236 సాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో కొవిడ్‌ ‌రికవరీ రేటు 92.81 శాతంగా ఉంది. మరణాలు రేటు 0.56 శాతంగా ఉందని పేర్కొంది.

Leave a Reply