Take a fresh look at your lifestyle.

దశాబ్ది ఉత్సవాలు ఎవరికోసం??

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రపంచంలోనే గొప్ప చరిత్ర ఉంది.1952, 1969 మొదలు 2014 వరకు దశలవారీగా పోరాటం విస్తృతంగా కొనసాగడంతో పాటు 1969లో తుపాకీ తూటాలకు ఎదురొడ్డి పోరాడి తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించిన చరిత్ర తెలంగాణది. రాష్ట్ర సాధనతో పాటు రైతాంగం భూ పోరాటం,ఆదివాసి,గిరిజన, అస్తిత్వ,ప్రజా పోరాటాలు ఈ నేలపై కొనసాగాయి. అమరవీరుల త్యాగాల పునాదులతో దశలవారీగా జరిగిన ఉద్యమ ప్రస్థానాన్ని నేటి పాలకులు విస్మరించి వారి స్వయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఎజెండాలతో తెలంగాణ వాదాన్ని ప్రజల్లో మరోసారి రగిలించేందుకు దశాబ్ది ఉత్సవాల పేరట వందలాది కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తు సంబరాలను జరుపుకుంటున్నారు.

తెలంగాణ సాధన కోసం అనేక సంఘాలను ఏర్పరిచి దశలవారీగా ఉద్యమ భావజాల వ్యాప్తిని ప్రజల్లోకి తీసుకువెల్లుతున్న కాలంలోఎంతోమంది స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోశారు.తెలంగాణ ఉద్యమం నిరంతరం ప్రజల్లో రగిలే నిప్పు కనికల్లాగా ఉద్యమ ప్రస్థానం కొనసాగింది.10 జిల్లాలతో కూడిన  తెలంగాణ స్వరాష్ట్రం కోసం బెల్లి లలితక్క, మారోజు వీరన్న, ఐలన్న, నల్ల వసంత్‌, ‌సుదర్శన్‌, ‌కనకాచారి, ఆకుల భూమయ్య ,ముక్క కరుణాకర్‌, అనేకమంది ప్రజా పోరాటాలను నిర్వహించి ఉద్యమాలతో ప్రజలను చైతన్యం చేశారు. ఈ పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి నాటి రాజ్యం చేతిలో అమరులైయారు.17 ముక్కలైన బెల్లి లలితక్కను అమరవీరులను తెలంగాణ ఏర్పడిన తర్వాత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అమరవీరులను యాది మరిచిందనే చెప్పవచ్చు. బెల్లి లలితక్క త్యాగం ఉన్నతమైనది. తెలంగాణ పేరు అంటేనే ప్రాణాలను తీసే నిత్య నిర్బంధంలో  ఉద్యమించి 17 ముక్కలైన బెల్లి లలిత తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ఆమె త్యాగాన్ని స్వరాష్ట్రం కోసం అంకితం చేసింది. 2009 నుంచి 2014 ఉద్యమంలో అసలు బాసిన వందలాది మంది బిడ్డల కుటుంబాలను,తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విస్మరించింది.  2009లో విద్యార్థి,ఉద్యోగ, ప్రజా,కార్మిక,కర్షక పోరాటాల మూలంగా వెళ్ళువెత్తిన ఉద్యమాన్ని ఓటు బ్యాంకింగ్‌ ‌గా మలుచుకుని 2014, 2018లో రెండు సార్లు  బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలు కోరుకున్న ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా దశాబ్ది ఉత్సవాల పేరిట తెలంగాణ పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కంకణం కట్టుకుని జూన్‌ 2 ‌నుంచి 22 వరకు దాదాపు 20 రోజులపాటు తమ కార్యచరణను ప్రకటించుకుని వందలాది కోట్లను ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఆర్భాటాలతో కార్యక్రమాలను నిర్వహించి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి,రాబోయే రోజుల్లో మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ సెంటిమెంట్‌ ‌ను మరోసారి ప్రజల్లో రగిలించే ప్రయత్నంలో భాగమే దశాబ్ది ఉత్సవాలు తప్ప దశాబ్ది కాలంలో తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పవచ్చు.

అమరుల కుటుంబాలకు ఇస్తానన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ఔట్సోర్సింగ్‌, ‌కాంట్రాక్టు ఉద్యోగాలతో సరిపెట్టారు.నీళ్లు, నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను భావోద్వేగానికి తెరలేపి తమ స్వయ ప్రయోజనానికి ప్రజలను వాడుకున్నారు.నీళ్లు రావాలంటే,నిధులు కావాలి, నిధులు కావాలంటే నియామకాలు జరగాలి.అది కెసిఆర్‌ ‌కుటుంబానికి ప్రయోజనం తప్ప తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం కాదు.నీళ్ల కోసం ప్రాజెక్టులను నిర్మాణం చేయాలి.ప్రాజెక్టులకు నిర్మాణం చేయాలంటే బడ్జెట్ను కేటాయించాలి..అలా కేటాయించాలంటే కెసిఆర్‌ ‌కుటుంబానికి నియమకాలు జరగాలి.అందులో భాగంగానే తమ కుటుంబాల్లో నియామకాలు చేపట్టుకుని నీళ్ల కోసం నిధులను మంజూరు చేసుకుని ప్రాజెక్టులను కట్టుకుని నీళ్లను మలుపుకున్నారే తప్ప భూమిలేని లక్షలాదిమంది కుటుంబాలకు ఎకరా భూమి కూడా పంపిణీ చేయనప్పుడు నీళ్లు వచ్చి ఏమి లాభం?నిధులు ఎవరికి వచ్చాయి?? నియామకాలు ఎవరికి వచ్చాయి ?? ప్రజలకు ఏమి ప్రయోజనం చేకూరింది? సమైక్య పాలనలో కృష్ణానది జలాలలో ఎంత వాటర్‌ ‌దక్కిందో నేడు స్వరాష్ట్రంలో కూడా అంతే వాటార్‌  ‌దక్కుతుంది తప్ప అదనంగా ఒక్క టీఎంసీ కూడా రాలేదని పోరాటం నేటికి కొనసా గుతుంది.దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులైన  పాలమూరు,రంగారెడ్డి నక్కలగండి డిండి ప్రాజెక్టులను పెండింగ్లోనే ఉంచారు కానీ పూర్తి చేయలేదు. అసెంబ్లీలో మాత్రం బడ్జెట్‌ ‌కేటాయింపులు జరుగుతున్నప్పటికీ ఆచరణలో ఒక్క రూపాయయి  కూడా విడుదల చేసి దక్షిణ తెలంగాణలో వివక్షతకు గురవుతున్న ప్రజలకు మాత్రం నీటి సమస్యను తేల్చడం లేదు.
తెలంగాణ యువత కొట్లాడితే ఉద్యోగాలు అరా కోర అవి  పేపర్‌ ‌లీకేజీల వ్యవహారమే తప్ప నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. పౌర ప్రజాస్వామిక హక్కులను దశాబ్ది కాలం పాటు తెలంగాణలో లేని దుస్థితి స్వరాష్ట్ర పాలనలో ఏర్పడింది. గత పాలకులు చేసిన నిర్లక్ష్యంగా ఇలా కొనసాగుతుందని చెపుతున్న నేటి పాలకులకు కనీస విజ్ఞత లేదు. సమైక్య పాలనలో జరుగుతున్న వివక్షత, అవినీతి, అభివృద్ధి  పౌర ప్రజాస్వామ్య హక్కులు కాల రాయబడుతున్నాయనే నినాదంతోనే తెలంగాణ స్వరాష్ట్రం కావాలని ఉద్యమాలు జరిగాయి . స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం సమైక్య పాలన కంటే భిన్నంగా ప్రజలకు ప్రజల ఆకాంక్షలను ఉద్యమకారుల ఆకాంక్షలను చేయాల్సిన బాధ్యతను విస్మరించారు.స్వరాష్ట్రాన్ని బాగు చేయడం సమయం పడుతుందని ఇలా కల్లబొల్లి మాటలు చెబుతూ కాలయాపన చేస్తూ 9 సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు.గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల ఏకకాల రుణమాఫీ హామీని అమలు చేయకపోగా గడిచిన 9 ఏండ్లుగా రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం శ్వేత పత్రం కానీ వారి కుటుంబాలను ఆదుకునే పని చేయలేదు. రైతులు పండించిన ప్రతి పంటను మద్దతు ధరకు కొంటామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ ‌తొమ్మిదేళ్ల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయకపోగా నేటికీ యాసంగి వరి ధాన్యం కళ్ళంలోనే ఉండిపోయింది.రైతాంగాన్ని బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని గ్రామాలలోని రైతులు తమ ఆవేదనను వివిధ రూపాలలో వ్యక్త పరుస్తున్నారు.

ఫ్రెండ్లీ పోలీసులు,ప్రజలు ప్రజాస్వామిక వాదులపై ఉద్యమకారులపై ప్రశ్నిస్తున్న వాళ్లపై అక్రమ కేసులు పెట్టుతూ జైల్లో బంధిస్తూ ఏదైతే కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రలో కూడా అక్రమ అరెస్టులు గృహ నిర్బంధాలు అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధిస్తున్న దుస్థితి స్వరాష్ట్రంలో కొనసాగుతుంది. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల దళితులపై దాడులు,ఇసుక అక్రమ రవాణానుఅడ్డుకున్న దళితులపై ప్రజలపై ప్రజాస్వామ్యవాదులపై దాడులు చేస్తూ శాంతి భద్రతలను అదుపు చేయడంలో విఫలం చెందారు. షీ టీం ల పేరుతో మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నారే తప్ప మహిళలపై దాడులు గృహహింసలు హత్యలు అత్యాచారాలు ఆగడం మాత్రం సాధ్య పడలేదు. నిజాం షుగర్‌ ‌ఫ్యాక్టరీ, ఆజాం జహీ మిల్‌, ‌పార్ట్ ‌టూల్స్, అల్విన్‌, ‌హెచ్‌ఎం‌టి ,ఐడిపీఎల్‌ ‌లను ప్రభుత్వం తేరవలేదు. ఫ్యాక్టరీలో పనిచేసే లక్షలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు.రాష్ట్రం ఏర్పడితే ఫ్యాక్టరీలను తెరిచి లక్షలాదిమంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని కార్మిక లోకం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి బయ్యారం స్టీల్‌  ‌ప్లాంట్‌ ‌ను ఏర్పాటు చేయలేదు. ఇలా కార్మిక వర్గానికి కెసిఆర్‌ ‌ప్రభుత్వం పెద్దగా చేసింది ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. మిషన్‌ ‌కాకతీయ పేరుతో చెరువుల పూడికతీత చెరువుల ఆధునీకరణ పేరుతో అక్రమాలు జరిగాయి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు తలెత్తిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది.మద్యం ఏరులై పారడంతో గ్రామాలలో కుటుంబ హింస పెరిగిపోతుంది. యువత మద్యానికి బానిసలై డ్రగ్స్ ‌మాఫియా తెలంగాణ మారుమూలల పల్లెలో కూడా డ్రగ్స్ ‌వ్యాపించి యువత చెడు దారిన వెళ్తున్న దుస్థితి గ్రామాలలో నెలకొంది. వైద్య రంగంలో ప్రభుత్వం పెద్దగా చేసింది ఏమీ లేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఏరియా హాస్పిటల్‌ ‌తో పాటు ప్రతి మండల కేంద్రంలో 30 పడకల హాస్పిటల్‌ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ తాత్కాలికంగా నిలిచిపోయింది.గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటు పడడంతో పాటు  స్వంత కార్యాలయాలు గ్రామాలలో బెల్ట్ ‌షాపులు విచ్చలవిడిగా ఉండడంతో మద్యానికి బానిసై కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పల్లె ప్రకృతి వనం వైకుంఠధామాలు నర్సరీలు క్రీడా ప్రాంగణాల పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అసైన్డ్ ‌భూములను రాష్ట్ర ప్రభుత్వం ఖజానా చేసుకొని పల్లెల్లో పేదవారిని పేదవారిగానే ఉంచారు.

అభివృద్ధికి నోచుకోని దుస్థితి గ్రామీణ ప్రాంతాలలో నెలకొని ఉంది.గ్రామాలలోని దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి, డబల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు నేటికీ అమలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తు నాలుగు లేబర్‌ ‌కోడ్‌ ‌లను  తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. కార్మిక హక్కులను కాల రాయబడుతున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన బాధ్యతను తీసుకోలేదు. ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ కార్మికులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు,వివోఏ లు,ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు, మున్సిపల్‌ ‌కార్మికులు ,మధ్యాహ్నం భోజన కార్మికులు అనేక రంగాల్లో కింది స్థాయి  ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మెలు దీక్షలు నిరసనలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.నేటికీ పరిష్కరించబడలేదు.దశాబ్ది ఉత్సవాలను అస్త్రంగా చేసుకుని  భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కేసీఆర్‌  ‌మూడవసారి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేసే విధంగా ఎన్నికల ప్రచారానికి తెరలేపే  దశాబ్ది ఉత్సవాలు తప్ప ప్రజల ఉత్సవాలు కావు. దశాబ్ది ఉత్సవాల లోగోలో అమరవీరుల త్యాగాలు,  ఉద్యమకారుల నినాదాలు గాని ఏవి కనపడని పాలకులకు, దశాబ్ది ఉత్సవాలు ఎవరి కోసం?? తెలంగాణ ఉద్యమంటేనే కెసిఆర్‌ అనే నినాదాన్ని ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. ఉద్యమాన్ని తాను చేసినట్లుగా ఓట్లను మలుచుకోవడంలో మాత్రమే కేసీఆర్‌ ‌విజయం సాధించారనే చెప్పుకోవచ్చు..

ఉద్యమం కోసం,తెలంగాణ నినాదం నినదిస్తే చంపుతామన్న కాలంలో ఎదురొడ్డి పోరాడి నినదించి మరణించిన వారే అసలైన పోరాట వారసులు. 2009లో జరిగినటువంటి ఉద్యమంలో ప్రజలు,విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారనే జగమెరిగిన సత్యం. మిలియన్‌ ‌మార్చ్ ,అసెంబ్లీ ముట్టడి ,రాజ్‌ ‌భవన్‌, ‌సాగరహారం సకల జనుల సమ్మె సబండ వర్గాలు నినదించి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజలు నిత్యం పోరాట మార్గమే ఎంచుకుని రోడ్లపై నినందించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు.ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీ నెరవేర్చలేదు.  డబల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను అందివ్వలేదు తెలంగాణ ప్రజలపై అప్పుల భారం మోపి పుట్టబోయే బిడ్డ కూడా స్వరాష్ట్రంలో అప్పుగా చేసిన ఘనత  కేసీఆర్‌  ‌దే. .

ప్రశ్నిస్తున్న ప్రజలపై ప్రజాస్వామ్యవాదులపై బుద్ధి జీవులపై సామాజిక కార్యకర్తలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడుతూ జైల్లో బంధించి ఏకపక్ష ధోరణితో పరిపాలన చేస్తున్నందుకు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంది కానీ దశాబ్ది ఉత్సవాలలో ప్రజలను ఎక్కడ వారి సమస్యలను వినే స్థితిలో అధికారులు కానీ పాలకులు కాని లేదంటే దశాబ్ది ఉత్సవాలు కేసీఆర్‌ ‌కోసమే?? అమరుల త్యాగాలను స్మరిస్తూ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు జరిగే పోరాటంలో భాగస్వామ్యం అయినప్పుడే అమరుల త్యాగాలకు మనమిచ్చే నిజమైన నివాళులు.
– వేముల గోపినాథ్‌ ‌సామాజిక ఉద్యమకారులు  9666800045

Leave a Reply