Take a fresh look at your lifestyle.

ఎన్నడూ లేని విధంగా గిరిజనులకు భూమి హక్కు

జగన్‌ ‌సిఎం నిర్ణయం అభినందనీయం :  పుష్ప శ్రీవాణి

విజయవాడ,సెప్టెంబర్‌ 30 : ‌దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గిరిజనులకు సీఎం జగన్‌ ‌భూమి హక్కు కల్పిస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. ఈ మేరకు ఆమె డియాతో మాట్లాడుతూ అనేక దశాబ్దాల గిరిజనుల పోరాటానికి సీఎం జగన్‌ ‌పరిష్కారం చూపారు. ఏ గిరిజనుడు, గిరిజన సంఘాలు పోరాటాలు చేయకుండానే సీఎం జగన్‌ ఈ ‌హక్కులు కల్పిస్తున్నారు. లక్షా 10 వేల మందికి ఆర్వోఎఫ్‌ఆర్‌ ‌పట్టాలు ఇస్తున్నాం. సుమారు 2 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. కమ్యూనిటీ పట్టాల ద్వారా 60 వేల మందికి పంపిణీ చేస్తున్నాం.

లక్షా 60 వేల ఎకరాలు కమ్యూనిటీ పట్టాలిస్తున్నాం. భూములు లేని గిరిజనులకు కూడా ఒక్కొక్కరికి 2 ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. అనేక దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేస్తున్న భూమికి రెవిన్యూ పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నామని వివరించారు. మొత్తం 3 లక్షల 50 వేల ఎకరాలకు గిరిజనులకు సాగు హక్కు కల్పిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దఎత్తున గిరిజనులకు భూ పంపిణీ చెయ్యలేదు. సీఎం జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుని గిరిజన పక్ష పాతిగా నిలిచారు’ అని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.

Leave a Reply