Take a fresh look at your lifestyle.

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డ ఆర్థిక సాయం

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యని మనోహర్ రెడ్డి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింలు బుధవారం అనారో గ్యంతో మృతి చెందారు. విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా  తెలుసుకున్న డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అంత్యక్రియల నిమిత్తం మృతుని కుటుంబానికి పార్టీ  నేతలతో కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్, నాయకులు రాజు, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply