కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సేవకుల ప్రభుత్వం… ఎంపీటీసీ కుర్మనీ మంజుల దస్తప్ప
ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సేవకుల ప్రభుత్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందనీ ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంటుంది తప్ప పాలకుల కోసం కాదని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తిత్వలు లేకుండా నిజమైన అర్హులకు అందించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చిందని ఎంపీటీసీ మంజుల దస్తప్ప అన్నారు కొడంగల్ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మా అదృష్టం అన్నారు రాబోయే రోజుల్లో సిద్దిపేట సిరిసిల్ల ధీటుగా కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని దీమ వ్యక్తం చేశారు