Take a fresh look at your lifestyle.

అసలైన ఘట్టం అవిష్కృతం

మేడారం అలయ అభివృద్ధికి 100 ఎకరాల భూసేకరణ..ఇప్పటికే 50 ఎకరాల పూర్తి
 ఆలయ శాశ్వత అభివృద్ధికి ప్రత్యేక కమిటి తల్లుల ఆగమనానికి ఏర్పాట్లు పూర్తి
 పరిశోధకులు, పూజారులు సహకారంతో తల్లుల వాస్తవ చరిత్రపై శిలాశాసనాలు
 మినీ జాతర వరకు ఏర్పాటుకు ప్రయత్నం మేడారం అభివృద్ధికి  సిఎం సంపూర్ణ సహకారం
 మీడియా సమావేశంలో మంత్రి సీతక్క

మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : అసలైన ఘట్టం మరికొన్ని గంటల్లో అవిష్కృతం కానున్నట్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం నాడు, మేడారంలోని మీడియా పాయింట్‌ వద్ద మంత్రి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ…నేడు బుధవారం సాయంత్రం కన్నేపల్లీ నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు గద్దేల పైకి చేరుకుంటారని, 22న చిలకులగుట్ట నుంచి సమ్మక్క తల్లిని ఎస్పి గౌరవ వందనంతో గాలిలో తుపాకీ పేల్చి, పూజారులు గిరిజన సాంప్రదాయాలతో సమ్మక్క తల్లిని వనం నుండి గద్దె పైకి అంగరంగా అంగరంగా వైభవంగా తీసుకొస్తారని తెలిపారు. 23న అమ్మవార్లు గద్దెలపై కొలువు తీరుతారని, ఆ రోజు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారన్నారు. 24న తిరిగి అమ్మవార్లు వన ప్రవేశం చేస్తారని తెలిపారు. భక్తులు స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని ఆమె సూచిం చారు. ఈ మహా జాతరకు బస్సులు, ఎడ్లబండ్లు, వ్యాన్‌లు వివిధ వాహనాల ద్వారా జాతరకు లక్షలాది మంది ఇప్పటికే చేరుకున్నారన్నారు. సుదూర ప్రాంతాల నుండి వొచ్చే భక్తులకు రవాణాకు  ఇబ్బందులు లేకుండా  రోడ్లు వెడల్పు చేశామన్నారు. హన్మకొండ నుండి పస్రా, తాడ్వాయి నుండి మేడారం వరకు 4 లైన్ల రోడ్లు వెడల్పు  చేశామన్నారు.  భక్తులకు ఇబ్బంది లేకుండా అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు ఊరట్టం నుంచి పార్కింగ్‌ స్పాట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంచి నీటి సౌకర్యాన్ని ఎక్కువగా పెంచినట్లు తెలిపారు.

భక్తులకు బంగారం పంపిణీని రద్దీ లేకుండా రేపటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నట్లు అనే చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన శ్రీ మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. జాతర నిర్వహణకు భక్తుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి 110 కోట్లను కేటాయించారన్నారు. సుమారు 60 లక్షల మంది భక్తులు ఇప్పటి వరకు అమ్మవార్ల దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కోటి దాటే అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు.  జిల్లాల్లో ఈ నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, గవర్నర్‌లు అమ్మవార్ల దర్శనానికి రాన్నునట్లు ఆమె తెలిపారు. విఐపిలకు పాసులు ఇస్తున్నామని వారు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జాతరలో 16,000 వేల మంది కింది స్థాయి సిబ్బంది పనిచేస్తున్నట్లు వివరించారు. అలగే 12,000 వేల మంది పోలీసు సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. శానిటేషన్‌, స్నానఘట్టాలు, మీడియా పాయింట్‌, తాగునీరు, అన్నింటి పరిధి పెంచినట్లు చెప్పారు. 40 బైక్‌ అంబులెన్స్‌లను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

క్యూ లైన్‌లను విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం ఆలయ శాశ్వత అభివృద్ధికి ఇప్పటి వరకు 50 ఎకరాల భూ సేకరణ పూర్తయినట్లు తెలిపారు. మిగతా 50 ఎకరాల భూ సేకరణ నిమిత్తం రైతులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా  మేడారంలో పచ్చదనం, పర్యావరణం పెంపొందేలా జంపన్న వాగు వద్ద మొక్కలు నాటనున్నట్ల్లు చెప్పారు. సమ్మక్క-సారలమ్మ యుద్ద పోరాటం, తల్లుల చరిత్ర 1000 ఏళ్లు గుర్తుండిపోయేలా శిలాశాసనం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. జాతర అనంతరం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ధికి చెప్పట్టాలిసిన పనుల పై  రాన్నున మినీ జాతర కల్లా  మేడారం అభివృద్ధి  తీసుకోనున్నట్లు వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) శ్రీజ, ఎండోమెంట్‌ కమిషనర్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply