Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బుయ్యాని మనోహర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: తాండూరు నుండి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బుయ్యాని మనోహర్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రొటెం స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో తాండూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన బుయాని మనోహర్ రెడ్డి శాసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తూ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తూ సభ మర్యాదను, సంప్రాదాయాలను పాటిస్తానని దైవ సాక్షిగా ప్రమాణ చేస్తున్నాని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ గా ఉన్న మనోహర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టడం పట్ల తాండూరు నియోజకవర్గం లోని పార్టీ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.

Leave a Reply