సంకటోనిపల్లి వినాయకునికి ఆమనగల్లు ఎస్సై ప్రత్యేక పూజలు
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : గణేష్ నవరాత్రోత్సవాలా భాగంగా ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 8వార్డు సంకటోనీపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన వినాయకునికి ఆమనగల్లు ఎస్సై బలరాం, కౌన్సిలర్ కమటం రాధమ్మవెంకటయ్య దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ఐ యాదయ్య, గ్రామస్తులు కమటం బాలయ్య, ధనుంజయ్య, అనంతరాములు, యాదగిరి, సూర్యనారాయణ, దేవరశెట్టి మహేష్, బాలకిష్టయ్య, రవి, కిష్టయ్య, పర్వతాలు, శ్రీకాంత్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.