Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ కు ఓటు వెస్తే చీకటి బతుకులే

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు వారంటీ గ్యారెంటీ లేదు.
తాండూరు గడ్డ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అడ్డ.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విటల్ నాయక్.
తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చీకటి బతుకులు కమ్ముకుంటా యని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విటల్ నాయక్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం యాలాల మండలం రాస్నం గ్రామంతో పాటు పగిడియాల్, బాగాయిపల్లి, నాగసముందర్ గ్రామాలలో ఎమ్మెల్యే తల్లి వికారాబాద్ జడ్పిటిసి ప్రమోదిని దేవితో కలిసి స్థానిక నాయకులు గడపగడపకు తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ అభం శుభం ఎరుగని గ్రామీణ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అమలు కాని పథకాలపై మభ్యపెడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో స్కాములే తప్ప అబివృద్ది శూన్యం అన్నారు. బిఆర్ఎస్ పార్టీ హయాం లో
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం  పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చోరవతోనే  యాలాల మండలంలోని ప్రతి గ్రామంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే అధికంగా అభివృద్ధి చేసి చూపించామని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మీ… బిడ్డగా మరోసారి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ అధ్యక్షులు అక్బర్ బాబా , వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి,  వైస్ ఎంపీపీ రమేష్ కుమార్, రాంచేందర్ రెడ్డి, పెట్లోళ్ల మల్లారెడ్డి, ఉప్ప సర్పంచ్ జనార్దన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సీనియర్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply