Take a fresh look at your lifestyle.

అభివృద్ధిని చూసి పట్టం కట్టండి… ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: తాండూరు నియోజకవర్గం లో చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ పట్టం కట్టాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం తాండూరు పట్టణంలోని పాత తాండూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన నిజాంశాయి దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు కోటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వార్డులో పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నేతలతోకలిసి వార్డులో పాదయాత్రను కొనసాగించారు. సందర్భంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కౌన్సిలర్లు, పార్టీ సీనీయర్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply