Take a fresh look at your lifestyle.

తాండూర్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరోసారి గెలిపించాలి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: గతంలో ఎవరు చేయని విధంగా తాండూరు ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆ పార్టీ ఇంద్రనగర్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా  బీఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మద్ అక్రమ్ సయ్యద్ సిరాజ్ తన్వీర్ ఖాన్ అబ్దుల్ అమీద్ మహమ్మద్ యూనుస్మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు గా ఎన్నడూ జరిగిన అభివృద్ధి తాండూరులో జరిగిందని ఎక్కడ చూసినా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన అభివృద్దే కనిపిస్తుందని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని, దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. పిలిస్తే పలికే నేనున్నానంటూ  ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నా పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాండూరు అభివృద్ధి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రెడ్డి కే సాధ్యమని అన్నారు.

Leave a Reply