పొలాలకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: గ్రామంలో పొలాలకు వెళ్లే దారిలో భారీగా వాగు ఉధృతంగా పారుతుండడంతో వాగు దాటడంలో అనేకమంది రైతులు ప్రమాదాల బారిన పడుతున్నారని వెంటనే ప్రజా ప్రతినిధులు స్పందించి కల్వటు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మదన్ పల్లి గ్రామం రైతులు కోరుతున్నారు. వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో పొలాలకు వెళ్లే దారిలో భారీగా వాగు పారుతుండడంతో పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కల్వర్టు నిర్మాణం చేపట్టి రైతులకు సౌకర్యం కల్పించాలని కోరిన ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించలేదని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు పేర్కొన్నారు. వెంటనే ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే ఆనంద్  లు స్పందించి పొలాలకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణం చేపట్టి గ్రామ రైతులకు సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా ఈ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.
పొలాలకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణం చేయాలి
Comments (0)
Add Comment