నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌లోక్‌ ‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసే పనిలో పడ్డారు. కొందరు మరోమారు సెట్లను సమర్పిస్తున్నారు.

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా మే నెల 13న పోలింగ్‌ ‌జరగనుండటంతో..ఈ నెల 18 మొదలైన నామినేషన్‌ల పక్రియ గడువు నేటితో ముగియనుంది. గడువు ఒక్క రోజే ఉండటంతో పెద్ద సంఖ్యలో నామినేషన్‌లు దాఖలవుతున్నాయి.

Comments (0)
Add Comment