కెసిఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం ఒకదానిని మరోటి ఢీకొన్న వాహనాలు

స్వల్పంగా దెబ్బతిన్న 8 కార్లు…తప్పిన ముప్పు
బస్సును ఆపి కెసిఆర్‌ను కలుస్తున్న రైతులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన వాహన శ్రేణిలోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఇలా మొత్తం 8 కార్లకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లో ఉన్న వారికి ముప్పు తప్పినట్లుగా తెలిసింది. ఈ 8 వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ముందు వెళ్తున్న కారు డ్రైవర్‌ ‌సడెన్‌ ‌బ్రేక్‌ ‌వేయడమే ప్రమాదానికి కారణమని అంటున్నారు. బస్సు యాత్ర, రోడ్‌ ‌షోల ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్‌ ‌దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తొలిరోజైన నేడు మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్‌ ‌బస్సు యాత్ర వొచ్చే నెల పదో తేదీన సిద్ధిపేట బహిరంగ సభతో ముగుస్తుంది.

నల్గొండ జిల్లాలో కేసీఆర్‌ ‌బస్సు యాత్ర కొనసాగుతుండగా.. ఆయన బస్సును ఆపి నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు తమ గోడు వినిపించారు. ఐకేపీ సెంటర్‌ ‌నుంచి గన్నీ బ్యాగుల ప్రదర్శన చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 20 రోజుల నుంచి కల్లాల్లో వడ్లు పోసుకొని కూర్చున్నామని ధాన్యం ఎవరూ కొనడం లేదని ఆవేదన చెందారు. కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ‘మీరున్నప్పుడు ఎండాకాలం కుడా నీళ్లు మత్తళ్లు దుంకేవని, వి•రు ఉన్నప్పుడే మంచిగుండే సార్‌.. ‌మల్లా వి• పాలనే రావాలి’ అంటూ రైతులు నినాదాలు చేశారు.

రైతు బంధు లేదు.. 500 బోనస్‌ అన్నరు అది బోగస్‌ అయింది.. మేం పండించి కల్లంల పోసిన ధాన్యాన్ని కొంటలేరు. ఇగ బోనస్‌ ఏమిస్తారు సార్‌. ‌కాంగ్రెస్‌ ‌పాలన అంత బోగస్‌ ‌పాలన అయ్యింది…అంటూ రైతన్నలు గోడు వెళ్లబోసుకున్నారు. ‘పోరాడి సాధించుకుందాం..నీళ్లు, కరెంటు మళ్లా తెచ్చుకుందాం. పోరాటానికి సిద్ధంగా ఉండండి’ అని కేసీఆర్‌ ‌పిలుపు ఇచ్చారు. అంతకు ముందు అన్నెపర్తి దగ్గర కూడా కేసీఆర్‌ను ఆపి ఇదే తరహాలో రైతన్నలు తమ గోడు వెల్లబోసుకున్నారు.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment