నాగర్ కర్నూల్, జూన్ 26. ప్రజాతంత్రవిలేకరి: చైనా ముష్కరుల దాడిలో 20 మంది భారత జవాన్లు మృతి చెందడం దేశానికి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రాములు, తాడూర్ జెడ్పిటిసి రోహిణి గోవర్ధన్ రెడ్డి లు ఆవేదన వ్యక్తం చేశా రు. శుక్రవారం నాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అమర జవాన్లకు కాంగ్రెస్ సలాం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపు నివ్వడంతో జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. తాడూర్ జెడ్ పి టి సి రోహిణి గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు కొత్త సుమలత,జ్యోతి, మాధవి, నిజాముద్దీన్ లతోపాటు పలువురు మహా త్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత దేశ రక్షణకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన చర్యల వల్ల దేశ భూభాగాన్ని కాపాడుకోవ డం జరిగిందని అన్నారు. తిమ్మాజిపేట పాండు,కౌన్సిలర్ సుల్తాన్, నాయకులు నారాయణ గౌడ్, లక్ష్మయ్య, రవీందర్ గౌడ్, డేవిడ్ రాజు, గౌస్, అహ్మద్ పాషా, కొత్త గంగాధర్,సలీం, అర్జునయ్య, ఆయుబ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.
వెల్దండలో…
వెల్దండ : దేశ రక్షణలో భాగంగా భారత భూభాగం సరిహద్దులో చైనా ముష్కరుల చేతిలో నేలకొరిగిన వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు జాతీయ జెండాను మోసి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు దేశం కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు ఈ కార్యక్రమంల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి విజయ్ కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్, సీనియర్ నాయకులు పర్వతరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, శీను యాదవ్ పుల్లయ్య తో పాటు పాల్గొన్నారు.