వారి ఉపాధిపై దెబ్బకొట్టిన సర్కార్
కాంగ్రెస్ రాకతో అలముకున్న చీకట్లు
వెంటనే ఆదుకునే ఏర్పాట్లు చేయాలి
సిఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : నేతన్నలపై కాంగ్రెస్ సర్కారు కక్ష కట్టిందని, వారిపై ఎందుకింత కక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా…కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా..అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్లో వ్నిడియాతో మాట్లాడుతూ..పదేళ్ల తరువాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం తెలంగాణలో ఏర్పడిరదని అన్నారు. నేతన్నల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని, నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అర్డర్లు అపేసిందని మండిపడ్డారు. వెంటనే గతంలో మాదిరిగా నేతన్నలకు చేతినిండా అర్డర్లు ఇవ్వాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండిరగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత మిత్రా వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని..ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అవసరం అయితే మరింత సాయం చేయాలని సూచించారు.
కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదన్నారు. రైతన్న మాదిరే, నేతన్నల ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధకరమని, వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ సర్కార్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కేటీఆర్ అన్నారు. ఈ పదేండ్లలో నేతన్నలకు చేతి నిండా పని కల్పిస్తే..కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రంలో నాటి సంక్షోభం నెలకొందని ఆయన పేర్కొన్నారు. నేతన్నలకు ఆర్డర్లు ఆపడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో మాదిరే నేతన్నలకు చేతినిండా పని కల్పించాలని కోరారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండిరగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత మిత్రా వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని, అవసరమైతే మరింత సాయం చేసి ఆదుకోవాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదని, రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధకరమని, వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండుగలా కళకళలాడిన చేనేత రంగం..కాంగ్రెస్ రాగానే మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో..మళ్లీ కాంగ్రెస్ వొచ్చి నాగులు నెలలు గడవకముందే అదే విపత్కర పరిస్థితిని ఎదుర్కుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరం అవడంతోపాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని, చేనేత కార్మికులు, పవర్ లూమ్ ఆసాములతోపాటు కార్మికులు రోడ్డున పడటంతో.. పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ముందు చూపు లేకపోవడం వల్ల వేలాది మంది నేతన్నలు, పవర్ లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నా ప్రభుత్వానికి కనీస కనికరం లేదన్నారు. తమకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక లోకం.. ప్రతినిత్యం దీక్షలు, ధర్నాలు, నిరసనలతో.. ఏదో ఒక రూపంలో తమ ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఆదుకోవాల్సిన అధికార పార్టీ నేతలే కార్మికులను అవమానించేలా మాట్లాడటం..వారి మనోస్థయిర్యాన్ని మరింత దెబ్బతీస్తుందని, ఇటీవల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రతి కార్మికుని గుండెను గాయపరిచిందని, ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తడుక శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరి వేసుకుని తనువు చాలించాడని, ఇది ఆత్మహత్య కాదు..
ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగానే నేతన్నలు భావిస్తున్నారని కెటిఆర్ అన్నారు. నేతన్నలపైనా కాంగ్రెస్కున్న చిన్న చూపు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతుందన్నారు. కొత్తగా ప్రభుత్వంలోకి వొచ్చిన కాంగ్రె నాయకులకు ఒక్క సారి గతం గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నానని, సరిగ్గా ఇవే పరిస్థితులు సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉండేవని, తెలంగాణ సాధించాక పాలనా పగ్గాలు చేపట్టిన కేసిఆర్ తెలంగాణలో నేతన్నలను, వస్త్ర పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, సంక్షోభం నుంచి గట్ట్నెక్కించడానికి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. చిక్కిశల్యమైన ఈ పరిశ్రమను ఆదుకోవడానికి స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి ఒక రోజంతా అధికారులతో కలిసి అప్పటి సీఎం కేసిఆర్ సవ్నిక్ష నిర్వహించారని, నేతన్నల వేతనాలను, కూలీలను రెట్టింపు అయ్యేలా, ప్రతి కార్మికుడు నెలకు 15 నుంచి 20 వేలు సంపాదించుకుని గౌరవప్రదంగా జీవించేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందించారని, అనేక వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకువొచ్చారని, చేనేత మిత్రా, నేతన్నకు చేయూత వంటి కార్యక్రమాలు ప్రారంభించామని, వీటి కోసం భారీ ఎత్తున గత 60 ఏండ్లలో ఎప్పుడు లేనంత బ్జడెట్ కేటాయించామని కెటిఆర్ తెలిపారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే, రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లను రాష్ట్రంలోని నేతన్నలకు ఇచ్చి, చేతి నిండా పని కల్పించింది నాటి ప్రభుత్వమని, దీంతో అప్పటిదాకా ఉపాధి లేక అల్లాడిన కార్మికులకు పని లభించిందని, సంప్రదాయంగా వొస్తున్న వృత్తిని కొనసాగిస్తూనే పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా వారిని తీర్చిదిద్దేందుకు కూడా ప్రభుత్వం తోడ్పాటునందించిందన్నారు. మగ్గాల అధునీకీకరణ, రుణాల మాఫీ, మార్కెట్ తో అనుసంధానం వంటి అల్ రౌండ్ అప్రోచ్తో ముందుకు సాగిందని, వీటన్నింటి వలన కార్మికులకు ఉరట లభించడంతో, వీరికి మరింత పని కల్పించడంతోపాటు, కడుపునిండా అన్నం పెట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన బతుకమ్మ చీరల పథకం ప్రారంభించిందని, బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా అందించడంతో.. కార్మికులకు చేతి నిండా పని దొరికిందని, దీంతోపాటు.. రంజాన్, క్రిస్మస్ కానుకల్లో ఇచ్చే వస్త్రాల ఆర్డర్లు కూడా వారికి ఇవ్వడంతో కార్మికులకు మరింత ఉపాధి పెరిగిందని, ఇలా ఏడాదికి దాదాపు ఎనిమిది నెలల వరకూ వరుస ఆర్డర్లు అందడంతో.. సాంచాల పరిశ్రమలో సంతోషం వెల్లివిరిసిందన్నారు.
పవర్ లూమ్లను ఆధునీకరించుకునేందుకు సబ్సిడీపై రుణాలు కూడా ఇవ్వడంతో వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన జీవితాల్లో కొత్త వెలుగులు నింపినట్టయిందని, నేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ఆ మహాయజ్ఞం ఎన్నో గొప్ప ఫలితాలను ఇచ్చిందని, తెలంగాణలో వస్త్రపరిశ్రమ విస్తరించి ఉన్న వివిధ ప్రాంతాలతోపాటు.. కాంగ్రెస్తో పాటు గత ప్రభుత్వాల పాలనలో ఒకప్పుడు ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల కొత్త కాంతులతో వెలుగులీనిందన్నారు. వీటికి తోడు నేతన్నకు బీమా అమలు చేయడంతో కార్మికుల కుటుంబాలకు ధీమా లభించిందని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కార్మిక లోకంలో కొనుగోలు శక్తి కూడా పెరిగిందని, ఓవైపు కార్మికుల సంక్షేమం, మరోవైపు సమగ్ర అభివృద్ధితో వారి జీవితాల్లో గుణాత్మక మార్పు వొచ్చిందని, పవర్ లూమ్ కార్మికులు అధికంగా ఉండే కరీంనగర్, సిరిసిల్లతోపాటు.. వరంగల్, ఇతర ప్రాంతాల్లోని కార్మికులకు కూడా బీఆర్ఎస్ హయాంలో కోట్ల విలువైన ఆర్డర్లు ఇవ్వడంతో.. వస్త్ర పరిశ్రమకున్న అన్ని సమస్యలు తొలగిపోయాయని, మళ్లీ కాంగ్రెస్ రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయని, పరిశ్రమను దెబ్బతీయడంతో పాటు.. కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారు వెంటనే తన తీరు మార్చుకోవాలని కెటిఆర్ హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలని, తమ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెలకు కార్మికుల ఖాతాల్లో నేరుగా సూమారు 3000 రూపాయాల వరకు పడేవని, ఈ ప్రభుత్వం వొచ్చాకా చేనేత మిత్రా కార్యక్రమం అగిపోయిందని, మూలన పడిన సాంచాలను తిరిగి తెరిపించడానికి.. పరిశ్రమకు రావాల్సిన రూ.270 కోట్లు బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశరు. మరోవైపు సొంత రాష్ట్రంలోని కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు కమిషన్లకు కక్కుర్తి పడి..తమిళనాడుకు, సూరత్కు ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుందని, రైతాంగ సంక్షోభాన్ని చూసినట్టు నేతన్నల సంక్షోభాన్ని కూడా రాజకీయ కోణంలో కాకుండా.. పేద బడుగు, బలహీన వర్గాలైన నేతన్నల కోణంలో ఆలోచించి వెంటనే పరిష్కరించాలని రాష్ట్రంలోని నేత కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కెటిఆర్ వెల్లడిరచారు.