ప్రవీణ్, మహేష్ పోరాటం భరతమాత మరువదు : మంత్రి హరీష్ రావు
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాటు ను భగ్నం చేసే క్రమంలో వీర మరణం పొందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి, మహేష్ మరణం పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోమవారం ట్విట్టర్ ద్వారా.. వీర మరణం పొందిన ప్రవీణ్, మహేష్ త్యాగాలను భరతజాతి మరువజాలదన్నారు. ఉగ్రవాదుల పీచమనిచే విషయములో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బిడ్డల ధైర్య సాహసాలకు సలాం అని హరీష్ అన్నారు.