: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ దవాఖానలో ప్రణబ్ చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. అయినా ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పారు. తనకు కొరోనా పాజిటివ్గా నిర్దారణ అయినట్లు ట్విట్టర్లో ప్రణబ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
వారం రోజులుగా తనను కలిసిన వాళ్లు స్వీయ నిర్భందంలో ఉండాలని, కొరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇంకోవైపు మహమ్మారి నుంచి ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్ ఆకాక్షించారు. ప్రణబ్ కుమార్తె శర్మిష్టకు ఫోన్చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.