హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్ప్రెస్ వే కేసులో మొత్తం 96.21 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
ఇక ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్ లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కాగా మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే నామా నివాసంతో పాటు కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.