ఎపిలో మరో సచివాలయ ఉద్యోగి మృతి

  • వరుస కేసులతో సచివాల ఉద్యోగుల్లో ఆందోళన
  • మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి
  • చాంబర్‌లో రెండు నిమిషాలు మౌనం
  • కోవిడ్‌ ‌నేపథ్యంలో ఉద్యోగులు అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి

సచివాలయంలో కరోనాతో ఇరువురు ఉద్యోగులు మృతి చెందడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌, ‌గ్రావి•ణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి   దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. కరోనాతో మృతి చెందిన సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌ ‌జి.రవికాంత్‌,  ‌ఫైనాన్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ‌లో అసిస్టెంట్‌ ‌సెక్రెటరీ గా పనిచేస్తున్న పద్మారావుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతి చెందిన ఉద్యోగుల ఆత్మకు శాంతి కలగాలని తన చాంబర్‌లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్బంగా ఆయన సచివాలయ ఉద్యోగులు కోవిడ్‌ ‌జాగ్రత్తలను పాటించాలని, ఎక్కడైనా అస్వస్థత, అనారోగ్య లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ ‌కేంద్రాల్లో తప్పనిసరిగా కాల వ్యవధిని అనుసరించి రెండు టీకాలను వేయించుకోవాలని కోరారు. కోవిడ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు మరింత అప్రమత్తంగా వుండాలని కోరారు. మాస్క్ ‌తప్పని సరిగా ధరిస్తే, భౌతిక దూరంను పాటించాలని సూచించారు. ఇదిలావుంటే కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌భయంతో ఏపీ సచివాలయ ఉద్యోగులు వణుకుతున్నారు. తాజాగా ఏపీ సచివాలయానికి చెందిన మరో ఉద్యోగిని కరోనాతో మృతి చెందారు. గడిచిన మూడు రోజుల్లో ముగ్గురు ఉద్యోగులు మృత్యువాత పడటం అందరిలో కలవరం రేపుతోంది.పంచాయతీ రాజ్‌ ‌శాఖలో సెక్షన్‌ ఆఫీసరుగా పని చేస్తున్న శాంతకుమారి సోమవారం ఉదయం మృతి చెందారు.

రెండు రోజుల క్రితం శాంతకుమారి భర్త సచివాలయంలో అసిస్టెంట్‌ ‌సెక్రటరీగా పని చేస్తున్న వి.పద్మా రావు కూడా కరోనాతో మృతి చెందారు. కరోనా విలయం సృష్టించడంతో.. వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోంకు పర్మిషన్‌ ఇవ్వాలని ప్రభుత్వన్ని డిమాండ్‌ ‌చేస్తున్నారు. కాగా ఏపీలో కొత్తగా 6,582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,62,037 కు చేరింది. అందులో 9,09,941 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 44,686 కేసులు యాక్టివ్‌ ‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 22 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,410 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 2,343 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 35,922 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Comments (0)
Add Comment