prajatantra news latest breaking News, Updates happening in Telangana, Andhra pradesh,India and around the World that include politics,current affairs,entertainment,sports in Telugu, Telugu news paper, today Telugu news, Telugu news today, online Telugu news, Andhra Pradesh News
దాతర్పల్లి సభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు
నియంత్రిత పంట సాగు కాదు…ఇవాల్టి నుంచి పంట సాగు అందామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం దాతర్పల్లిలో వానా కాలం-20202 నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి, పిఏసిఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో దాతర్పల్లిలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించి మంత్రి హరీష్రావు రైతులకు ఎరువులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్రావు మాట్లాడుతూ…రైతే రాజు కావాలన్నది నినాదంగా కాకుండా విధానంగా మారాలన్నారు. దాతర్పల్లి అంటే.. ఆదర్శమని పోయిన యేడాది సన్న రకం వరి పండించి సేంద్రీయ ఎవుసం చేశారనీ, ఈ గ్రామానికి చెందిన సత్యనారాయణ రైతు తనకు బస్తా ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. రైతుకు మేలు జరగలన్నదే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు.
మంగళవారం సిద్ధిపేట జిల్లాలోని దాతర్పల్లిలో రైతులకు విత్తనాలు
పంపిణీ చేస్తున్న మంత్రి తన్నీరు హరీష్రావు
ఒకప్పుడు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లతో రైతులు దుర్భరమైన బతుకు వెళ్లదీసే వారనీ, కేసీఆర్ సిఎం అయ్యాక..టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక్క గుంట ఎండలేదు, ఒక గంట కరెంటు పోలేదన్నారు. నాడు ఎరువులు కావాలంటే క్యూలో నిల్చొవాల్సిన పరిస్థితి. కానీ, ఇవాళ మీ ఊర్లకే మందులు, యూరియా బస్తాలు పంపుతున్నామన్నారు. ఒకప్పుడు పంట పెట్టుబడి కోసం షావుకారు దగ్గర రైతు అప్పు తెచ్చుకునేవారనీ, కానీ, సీఎం కేసీఆర్ సర్కారులో రైతుబంధు కింద పెట్టుబడి సాయం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు కింద 7 వేల కోట్లు బ్యాంకులో జమ చేయమనీ, రెండు విడతల రైతుబంధు కింద రూ.14 వేల కోట్లు బరాబర్ ఇవ్వాల్సిందేనని సీఎం కేసీఆర్ మాకు చెప్పారని మంత్రి వెల్లడించారు. 25 వేలలోపు ఉన్న పంట రుణం ఉన్న వారందరికీ వారం రోజుల్లో రుణమాఫీ చేయనున్నామనీ, లక్షలోపు ఉన్న వారందరికీ నెల రోజుల్లో రుణమాఫీ చేస్తామన్నారు. ప్రాధాన్యత పంట సాగులో రాష్ట్రానికే గజ్వేల్ నియోజకవర్గం ఆదర్శమైందనీ, నియోజకవర్గంలోని 8 మండలాల్లో 5 మండలాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయన్నారు. వాటిలో 173 గ్రామాలకు 167 గ్రామాలు ప్రాధాన్యత పంట సాగుకు ఏకగ్రీవం చేశారంటూ.. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామ ప్రజాప్రతినిధులను మంత్రి హరీష్రావు అభినందించారు. ఎవుసంలో దాతర్పల్లిని ఆదర్శంగా చేద్దామనీ, ఈ వానా కాలంలో 381 ఎకరాల్లో పత్తి పంట వేయాలని నిర్ణయించి తీర్మానించిన గ్రామస్తులను అభినందించారు. విక్రయ కేంద్రానికి రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఇవ్వాలని మంత్రి సూచించారు. వానా కాలంలో మక్కజొన్న సాగును పూర్తిగా వదిలి కంది పంట, పత్తి పంట పైపు రైతులు ఆసక్తి చూపాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు హరీష్రావు. అప్పుల ఊబిలో నుంచి రైతులు బయటకు వచ్చి వ్యవసాయం లాభసాటిగా మారి.. వ్యవసాయం దండగ కాదు.. పండుగ కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యంమన్నారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు ప్రాధానత్య పంటల సాగుకు మేము సైతమని మంత్రి హరీష్రావు సమక్షంలో ప్రతినబూనారు. గ్రామ పంచాయతీ తీర్మాన కాపీని మంత్రికి అందజేశారు. అంతకుముందు గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజా రాధాక్రిష్ణశర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గజ్వేల్ ఎంపిపి దాసరి అమరావతి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.