- రైతే రాజు కావాలన్నది విధానంగా మారాలె…
- నియంత్రిత పంట సాగు కాదు..ప్రాధాన్య పంట సాగు అందాం
- 29న సిఎం కేసీఆర్ చేతుల మీదుగా
- కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం
- దాతర్పల్లి సభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు
నియంత్రిత పంట సాగు కాదు…ఇవాల్టి నుంచి పంట సాగు అందామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం దాతర్పల్లిలో వానా కాలం-20202 నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి, పిఏసిఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో దాతర్పల్లిలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించి మంత్రి హరీష్రావు రైతులకు ఎరువులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్రావు మాట్లాడుతూ…రైతే రాజు కావాలన్నది నినాదంగా కాకుండా విధానంగా మారాలన్నారు. దాతర్పల్లి అంటే.. ఆదర్శమని పోయిన యేడాది సన్న రకం వరి పండించి సేంద్రీయ ఎవుసం చేశారనీ, ఈ గ్రామానికి చెందిన సత్యనారాయణ రైతు తనకు బస్తా ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. రైతుకు మేలు జరగలన్నదే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు.
పంపిణీ చేస్తున్న మంత్రి తన్నీరు హరీష్రావు