రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. గ్రూప్ల వారీగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే గ్రూప్ 1- 503 ఉద్యోగాలు,గ్రూప్ 2- 1,373 ఉద్యోగాలు గ్రూప్ 4- 9168 పోస్టులు ఉన్నాయి.
జిల్లాల్లాలో- 39,829. జోన్లలో- 18,866, మల్టీజోనల్ పోస్టులు-13,170,సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147 పోస్టులు ఉన్నాయి. ఇక క్యాడర్ వారీగా ఖాళీలు.. పరిశీలిస్తే జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు.. పరిశీలిస్తే జోన్లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..ఇలా వున్నాయి. కాళేశ్వరం జోన్లో- 1,630, బాసర జోన్- 2,328, రాజన్న జోన్- 2,403, భద్రాద్రి జోన్- 2,858, యాదాద్రి జోన్- 2,160, చార్మినార్ జోన్- 5,297, జోగులాంబ జోన్- 2,190. ఉన్నాయి. మల్టీజోన్ 1- 6,800, మల్టీజోన్ 2- 6,370. గుర్తించామన్నారు. ష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సిఎం కెసిఆర్ ప్రకటించారు.
నియామక పక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. •ం శాఖ- 18,334, సెకండరీ ఎడ్యుకేషన్- 13,086, హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755, హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878, బీసీల సంక్షేమం- 4,311, రెవెన్యూ శాఖ- 3,560, ఎస్సీ వెల్ఫేర్ శాఖ- 2,879, నీటిపారుదల శాఖ- 2,692, ఎస్టీ వెల్ఫేర్- 2,399, మైనారిటీస్ వెల్ఫేర్- 1,825, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598, పంచాయతీరాజ్, గ్రాణాభివృద్ధి శాఖ- 1,455, లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221, ఆర్థిక శాఖ- 1,146, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895, మున్సిపల్ అడ్మినిస్టేష్రన్, అర్బన్ డెవలప్మెంట్- 859, అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801, రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563, న్యాయశాఖ- 386, పశుపోషణ, మత్స్య విభాగం- 353, జనరల్ అడ్మినిస్టేష్రన్- 343, ఇండస్ట్రీ, కామర్స్- 233, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్- 184, ఎ-లానింగ్- 136, ఫుడ్, సివిల్ సప్లయిస్- 106, లెజిస్లేచర్- 25, ఎనర్జీ- 16 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇందులో 39,829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తామన్నారు. వాటికి సంబంధించిన నియామక పక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని చెప్పారు. జిల్లాల్లో అత్యధికంగా హైదరాబాద్లో 5,268 ఖాళీలు ఉండగా, 1,976 పోస్టులతో నిజామాబాద్, 1769 పోస్టులతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 556 పోస్టులు ఉండగా, రాజన్న సిరిసిల్లాలో 601 ఖాళీలు ఉన్నాయి.