మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్లోనూ వైకాపా హవా చాటింది. అత్యధిక సీట్లను వైకాపా బలపర్చిన అభ్యర్థులు గెల్చుకున్నారు. బుధవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు పక్రియ మొదలైంది. 13 జిల్లాల్లోని 20 డివిజన్లు 160 మండలాల్లో మొత్తం 3221 పంచాయతీలు ఉండగా.. 579 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,639 సర్పంచ్,19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది.
పంచాయతీల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 634 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 14 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 0, ఇతరులు 11 చోట్ల గెలుపొందారు. జిల్లాల వారీగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలను చూస్తే వైకాపకు అనుకూలంగా ఉన్నాయి.