Take a fresh look at your lifestyle.

‘‌వైఎస్సార్‌ ‌వేదాద్రి’ ఎత్తిపోతలకు జగన్‌ ‌శంకుస్థాపన

ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తాం
ఆయా ప్రాంతాల మంచినీటి సమస్య తీరుస్తామన్నసిఎం

అమరావతి,ఆగస్ట్ 28 :  ‌సమస్యలను గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాగు,సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించారని అన్నారు.’వైఎస్సార్‌ ‌వేదాద్రి’ ఎత్తిపోతల పథకానికి వీడియో లింక్‌ ‌ద్వారా శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. వేదాద్రి నుంచి మంత్రులు అనిల్‌కుమార్‌ ‌యాదవ్‌, ‌పేర్నినాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్‌మోహన్‌రావు, కైలే అనిల్‌కుమార్‌, ‌మహిళా కమిషన్‌  ‌ఛైర్‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్‌ ఇం‌తియాజ్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సపంలో ఉన్న నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాలు తాగు, సాగు నీటికి కటకటలాడే పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశాం. ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలనే దృఢ సంకల్పం, లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు.  నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడం లేదు. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం.

డీబీఆర్‌ ‌బ్రాంచ్‌ ‌కెనాల్‌ ‌పరిధిలోని 30 గ్రామాలకు, వాటితో పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా ’వైఎస్సార్‌ ‌వేదాద్రి లిప్ట్ ఇరిగేషన్‌ ‌స్కీం’ ద్వారా నీరు అందిస్తామని సీఎం వెల్లడించారు. దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు. వేదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించడం ద్వారా రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌నిలిచారని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నారు. ఇది ముఖ్యమంత్రి పెళ్లి రోజు కానుకగా రైతుల కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి దంపతులు నూరు వసంతాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నో సంవత్సరాలుగా కన్న కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయన్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌ అప్పట్లో ఈ ప్రాంతానికి మేలు చేశారని, మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎకరాకు రూ.10 లక్షల రూపాయల విలువ పెరిగిందని.. రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతు బాంధవుడిగా సీఎం నిలిచిపోతారన్నారు. సీఎం వచ్చిన వేళా విశేషం కారణంగా మంచిగా వర్షాలు పడ్డాయని, నీళ్లు అందుతున్నాయన్నారు. పెళ్లి రోజున ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌వ్యాఖ్యానించారు.

Leave a Reply