
కలెక్టర్ శ్వేతామహంతి
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఒక ప్రక్రియ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్ లో మండల గ్రామస్థాయి అధికారులకు ఉద్దేశించి రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యరు.
రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఈ నెల 30లోగా మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగా హన కల్పించాలని ముఖ్యంగా అన్నిశాఖల అసిస్టెంట్ ఇంజనీర్లు టెక్నికల్ అసిస్టెంట్లు హాజరుకావాలని అన్నారు. ఈ నెల 31 లేదా జనవరి 1 న ఇదే విష యమై గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిం చాలి. ప్రతి పంచాయితీ కార్యదర్శి ఈ నెల 30 లోగా ఒకటో విడత పల్లె గ్రతి కార్యక్రమం పై తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలి అని అన్నారు.
Tags: Works progress, speed, pallepragathi, programme, collector swetha mahanthi