గ్రామాల్లో సమూల మార్పుకు కృషి చేయాలి
హన్మకొండ: రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా గ్రామాల్లో పలు అంశాలను తప్పనిగా నిర్వహించేందుకు ప్రజలు గ్రామ సర్పంచులచే గ్రామస్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, పచ్చదనం పరిశుభ్రత పాటించేందుకు ప్రజలను చైతన్యం చేసి గ్రామాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన రోజు వారి కార్యక్రమంలో ఏలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు రోజు వారి కార్యక్రమాల వివరాలను జిల్లా కలెక్టర్ వివరించారు. జనవరి 2న ఉదయం 9 గంటలకు గ్రామసభ నిర్వహించిన పిదప ఉదయం 11.30 గంటల నుండి గ్రామంలో పాదయాత్ర, రెండోదశ పల్లె ప్రగతి కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని, జిపిలో నర్సరీ, డంపింగ్యార్డు వైకుంఠ దామాల నిర్మాణ ప్రదేశాల పరిశీలించి లోటుపాట్లను గుర్తించి పనులు ప్రాంభించాలన్నారు. ట్రాక్టర్లు, డోజర్, ట్యాంకర్ కొనుగోలు పక్రియాను పూర్తి చేసి పై చర్యలు చేపట్టేందుకు వినియోగించుకోవాలన్నారు.
3వ తేదీన ఉదయం 8 గంటల నుండి పారిశుధ్య దినోత్సవ సందర్భంగా అన్ని ప్రభుత్వ సంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, పిచ్చిమొక్కల తొలగింపు, నీటినిల్వ, రోడ్డుపై గల గుంతలను పుడ్చుట, శిథిల గృహాలను తొలగింపు, తడి, పొడి చెత్తపై అవగాహన, పాడుబడిన బావులను, బోరులను పూడ్చుట చర్యలు చేపట్టాలని కలెక్టర్ వివరించారు. 4వ తేదీన మూడవ రోజు చనిపోయిన మొక్కల స్థానంలో మొక్కలు నాటుట దినోత్సవం సందర్భంగా నాటిన మొక్కలను సంవరక్షించుట రోడ్డుకు ఇరువైపుల నాటిన మొక్కల ప్రత్యేక దృష్టి సారించాలని, 100 శాతం సర్వేవల్ కాప్చర్ చేయాలని, మొక్కల చుట్టూ కలుపు మొక్కల చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తొలగించాలని, మొక్కల చుట్టూ నీరు పోసెందుకు అనువుగా సాసర్ చేయాలని, మొక్క చుట్టూ ఏర్పాటు చేసిన ట్రీ గార్డు, కంచే లోపాలను సరి చేయాలన్నారు. 5వ తేదీన 4వ రోజున ఉదయం 8 గంటల నుండి పారిశుధ్య దినోత్సవం నిర్వహించాలని, అన్ని ప్రభుత్వ సంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, పిచ్చి మొక్కలను తొలగించి, నీటి నిల్వ ప్రాంతాల్లో రోడ్డుపై గుంతలను పూడ్చాలన్నారు. శిథిల గృహాలను తొలగించాలని, తడి పొడి చెత్త వేరు చేయుటపై అవగాహన కల్పించాలని, పాడు పడిన బావులు బోర్లు లను పుడ్చాలి చేయాలి గ్రామంలో దోమల నివారణ పై పిచికారి చేయాలన్నారు.
Tags: Work towards group ,change in villages, prashanth j patil, palle pragathi programme