నిందితులను కడపనుంచి హైదరాబాద్కు తరలింపు
హైదరాబాద్,ఫిబ్రవరి10 :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగి రెడ్డి, దస్తగిరితో పాటు మరో నిందితుడు ఉమాశంకర్రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. ఉమాశంకర్ రెడ్డి వాహనం ట్రాఫిక్లో నిలిచిపోవడంతో మిగిలిన నిందితులను తొలుత కోర్టులో హాజరుపరచలేదు. అతడు వచ్చేవరకు విచారణను సీబీఐ కోర్టు కాసేపు వాయిదా వేసింది. ఉమాశంకర్రెడ్డి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్,ఫిబ్రవరి10 :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగి రెడ్డి, దస్తగిరితో పాటు మరో నిందితుడు ఉమాశంకర్రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. ఉమాశంకర్ రెడ్డి వాహనం ట్రాఫిక్లో నిలిచిపోవడంతో మిగిలిన నిందితులను తొలుత కోర్టులో హాజరుపరచలేదు. అతడు వచ్చేవరకు విచారణను సీబీఐ కోర్టు కాసేపు వాయిదా వేసింది. ఉమాశంకర్రెడ్డి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది.
నిందితుల్లో శివశంకర్రెడ్డి, ఉమాశంకర్రెడ్డి, సునీల్ యాదవ్ ఇప్పటికే కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండటంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్గా మారిన దస్తగిరి బెయిల్పై బయట ఉన్నారు. వివేకా హత్య కేసు విచారణను కొద్దిరోజుల క్రితం ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కేసు బదిలీ నేపథ్యంలో సీబీఐ అధికారులు కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న హత్య కేసుకి సంబంధించిన అన్ని్గ •ళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను మూడు బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకు ఇప్పటికే తీసుకొచ్చారు.