‘‘గుజరాత్ కోర్టు తీర్పుతో విపక్షాల గుండె గాయపడింది, చతికిలపడ్డ విపక్షాలను కెలికి లేపింది,దానితో విపక్షాలను ఏకం చేసింది. ప్రజాస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీజేపీ అబద్దం, అహంకారం,నిరంకుశత్వం దుర్మార్గాలకు అంతం ఎంతో దూరంలో లేదు.కర్ణాటక నుండే ప్రారంభం అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఎమర్జెన్సీ తలపించే విధంగా ఒకనాడు కాంగ్రెస్ ఏక పార్టీగా చలామణి అయితే అదే బాటలో బీజేపీ నడుస్తోంది.ఇందిరను మించిన నియంత నరేంద్ర మోదీ కి వ్యతిరేకంగా నిలువెత్తు నిరసన పతాకమవుతుంది.’’
డా।। సంగాని మల్లేశ్వర్
జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, 9866255355.