Take a fresh look at your lifestyle.

ఏడాదికి కోటి,రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ…?

దేశంలో విస్తృతంగా నిరుద్యోగం పాపం పెరిగినట్టు పెరుగుతొంది.కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల యువత జీవితాలు దారిద్ర్యంలోకి నెట్టబడుతున్నాయి.నిరుద్యోగంతో పోరాడుతున్న యువతను తప్పుదారి పట్టించే విధంగా యూపీఏ ప్రభుత్వం చేయలేని కోటి ఉద్యోగాలను కేంద్రంలో అధికారంలోకి వస్తే భర్తీ చేస్తామని ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రగల్బాలు పలికి, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలోని యువతకు ఏడాదికి 2 కోట్ల  ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చి, దేశాభివృద్ధికి యువశక్తి కీలకమని, బీజేపీ వోట్లు దండుకొని, చిలుక పలుకులు పలుకుతుంది. హామీ ఇచ్చిన  లెక్కన ఇప్పటికి 18 కోట్ల ఉద్యోగాలు కల్పించే మాటతప్పి కొత్త నిర్వచనాలు చెప్పుతుంది. గత ఏడాది బడ్జెట్‌లో వచ్చే ఐదేళ్లలో కేవలం 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట మార్చింది.
ఇప్పటికి కేంద్ర ప్రభుత్వంలో ఆదీనంలో తొమ్మిది లక్షల పోస్టులు ఖాలీ గా ఉన్నాయి. రైల్వేలో 15శాతం  డిఫెన్స్‌లో 40శాతం, హోం వ్యవహారాల్లో 12శాతం పోస్టులు ఖాలీ గా ఉన్నాయి.ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా వేలం వేయడం, ప్రైవేటీకరించడం ద్వారా వేలాది మంది ఉద్యోగులకు ఉపాధి లేకుండా చేసే ప్రయత్నం అహరహం కొనసాగుతుంది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి , బీజేపీ  ప్రభుత్వం తొమ్మిది ఏళ్లుగా ప్రజలను దగా చేస్తుంది. దేశంలో జనాభా పెరుగుతున్నట్టు ఉద్యోగ కల్పన జరగడంలేదు. నేడు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 9.81శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 7.47శాతం ఉంది. ప్రతి ఏటా సాయుధ బలగాల్లో దాదాపు 60వేల మంది ప్రతి సంవత్సరం పదవి విరమణ పొందుతే, భర్తీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. సైనికులకు రక్షణ లేకుండా అగ్నిపథ్ పేరుతో ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ అనే పథకాన్ని ప్రతిపాదించి  పింఛన్ రాకుండా చేసిందనే విమర్శ ఉంది.నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అన్నట్లుగా కార్యకర్తలతో నిరుద్యోగ మార్చ్ నిర్వహించడం విడ్డురంగా ఉంది.రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్న రాష్ట్రంలోని బీజేపీ నేతలు నిరుద్యోగుల పక్షాన మాట్లాడడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట.

తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం అయితే  కేసీఆర్ కు మాత్రం ఒక టాస్క్. ఉద్యమ సమయంలో  నీళ్లు, నిధులు, నియామకాల హామీలను గత తొమ్మిది ఏళ్లుగా  ఆవిష్కరిస్తూ,  ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో ముందస్తుగానే ఉపద్రవం పసిగట్టి కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్ టీఎస్ఐపాస్ అమల్లోకి తెచ్చారు. దానితో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారింది. అనతికాలంలోనే  1లక్ష  32వేల ఉద్యోగాలు భర్తీ చేసింది.దేశంలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వం చేయని సాహసం చేసి కుంభ జాబ్ మేలా ప్రకటించింది.95శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవతీసుకుంది. అందులో భాగంగా  91,142 వేల ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయడం అంటే ఆషామాషీ కాదు.ఖలేజా ఉన్న నాయకుడు దేశ్ కీ నేత కేసీఆర్ తో మాత్రమే సాధ్యం అయ్యిందనేది జగద్విదితం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తూ టీఎస్పీఎస్సి మార్క్ తనదైన శైలిలో చూపెట్టింది. అక్కడ నుండే విపక్షాల గగ్గోలు, ఏడ్పు మొదలైంది. ఇక అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష దాడికి దిగింది.టీఎస్పీఎస్సి ఏర్పర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానం ఆ సంస్థకే పరిమితం అనేది తెల్సి కూడా మాజీ ఐపీఎస్ అధికారి రాజకీయాలకు ఒడిగట్టినారు. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకులంలోని ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని ప్రకటించారు.ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కాగానే రాజకీయ దురదతో ప్రభుత్వంపై నిందమోపడం ఎంతవరకు సమంజసం? కమిషన్ విధులు, విధానాలు తెలియని  విపక్ష పార్టీల అధ్యక్షులు బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్, 2014కు ముందు కాంగ్రెస్ కోటి ఉద్యోగాల మాట ఏమైంది..? రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను తప్పుదారి పట్టించి లబ్ది పొందాలనే ఎత్తుగడ తెలంగాణలో చెల్లనేరదనేది జగద్విదితం.

తెలంగాణ తల్లి ఒక ప్రతీక అయినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతీక కాకుండా పోవడం ఎందువల్ల జరుగుతుందో తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ యువత గుండెల్లో ఆక్రమించుకున్న చోటును విపక్షాలు విధ్వంసం చేసే ప్రయత్నం ముమ్మరం చేసింది. సాధారణ ఎలక్షన్స్  దగ్గరకు వస్తున్న కొద్ది ,దక్షిణాదిన పాగావేయాలని పచ్చటి  తెలంగాణలో నిప్పులు పోసుకుంటుంది. ఐటీ, ఫార్మా, పారిశ్రామిక రంగాల్లో గడచిన తొమ్మిది ఏండ్లలో 3.31 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.మొత్తంగా 22.36 లక్షల ఉద్యోగాలు కల్పించిందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే సంస్థ ఇటీవల కాలంలో వెల్లడించింది. ఐటీ ఉద్యోగాల నియామకంలో 156 శాతం వృద్ధి సాధించింది. తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది.నిజంగానే ఎదగాలంటే  ప్రజాసమస్యల మీద పోరాడే ప్రతిపక్షంగా వ్యవహరిస్తే, ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఆలా కాకుండా అబద్దపు మాటలతో  నిత్యం వార్తల్లో ఉండడం,ప్రభుత్వాన్ని ధాటిగా విమర్శించడం పరిపాటి అయింది. అయితే  తెలంగాణ ప్రజలు  దురుసు, దూకుడు మాటలను ప్రజలు అన్ని సందర్భాలలోనూ నమ్మరు.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇష్టపడరు. పరుషంగా మాట్లాడే నేతల మీద గౌరవం కూడా ఉండదు.

ఐకమత్యం మా బలం.. క్రమశిక్షణ మా నైజం అని చెప్పుకునే  బిజెపి,ఈ మధ్య ఇంటిపోరుతో సతమతమవుతోంది. అందుకే ఈ బక్క ప్రాణాన్ని ఢీ కొట్టడానికి తెలంగాణలో ముందొకడు, వెనుకొకడు జమిలిగా నడుస్తున్నారు. దీనికి కేంద్రం వంత పాడడం వింత ఏమి కాదు. అయినా అబద్దం ఒక సజీవ తిరుగుబాటు లక్షణంగా ఎప్పుడో జీవచ్ఛవాలైన వారి పార్టీ గురించి ఏమి మాట్లాడుతాం.నిరుద్యోగ యువత ఉద్యోగాలకోసం  అగ్నిపథ్‌  స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన వందలాది మందిపై నిర్ధాక్షిణ్యంగా  దాడి చేసి పొట్టన పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ అసంబంధమైన విధానాలను మర్చిపోయి,నిరుద్యోగులపై మొసలికన్నీరు కార్చుతుంది.దేశంలోని ఐటీ రంగంలో  2021-22లో 4.50 ఉద్యోగాలు వస్తే ఒక్క తెలంగాణలో 1,49,506 ఉద్యోగాలు సృష్టించి అగ్ర స్థానంలో నిలిచిందనేది నిర్వివాదాంశం.
ప్రపంచంలో  షార్ట్ కట్ పద్దతితో రాత్రికి,రాత్రి కోటీశ్వరులు కావాలనే అత్యాశమనుషుల తత్వాన్ని బట్టి ఉంటుంది. ప్రశ్నపత్రాల టిఎస్పిఎస్సి  ప్రశ్నపత్రాల కుంభకోణం వెనుక ఎవరున్నా వదిలేది లేదని ప్రభుత్వం హెచ్చరించి. దర్యాప్తు సంస్థ సిట్ కు   అప్పచెప్పింది. తీరా చూస్తే నేరస్తుల్లో ఒకరు రాజశేఖర్ బీజేపీ కార్యకర్తగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన అక్కసును సామాజిక మాధ్యమలలో పెట్టిన పోస్టులు సాక్షత్కరిస్తున్నాయి. దేశంలో కాంగ్రెస్ ,బీజేపీ హాయంలో పేపర్లు లీకయిన సంఘటనలు కోకొల్లలు,ఇంతకూ డబుల్ ఇంజన్ సర్కార్ గుజరాత్ లో 14 సార్లు లీకైతే ఏ మంత్రిని బర్తరఫ్ చేసినారో నీతులు చెప్పేముందు ఆలోచించాల్సి ఉంది. దేశంలో ఎక్కడలేని విధంగా టిఎస్పిఎస్సి పకడ్బందీగా నిర్వహించిన ఛైర్మన్, సీనియర్ ఐఏఎస్  అధికారి జనార్ధన్ రెడ్డి పై అభియోగం వెనుక కేసీఆర్ ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తుంది.గతంలో ఆయన పని చేసిన ఏ శాఖలో అవినీతికి, అక్రమాలకు ఆస్కారం లేదు.పనిగట్టుకొని  విమర్శలు చేస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ ప్రతినిధులు మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతమందిని బర్త్ రఫ్ చేసినారో ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ ఓర్వలేక  వెన్నెముక లేని బిజేపీ నాయకులు మోదీని ప్రసన్నం చేసుకోవడానికి కేసీఅర్ ను పోటీపడి తిట్టడానికి తొక్కిసలాడుతున్నారనే విమర్శ ఉంది. పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాలీ గా ఉన్న16 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది? 2014 తర్వాత బీజేపీ రెండుకోట్ల ఉద్యోగాలు ఏమైనవి? అధికార దాహంతో బీజేపీ నాయకుల తీరు రాష్ట్రంలో ఒకటి ,కేంద్రంలో ఒకనీతి అన్నట్లుగా అబద్ధాలకు తెరలేపింది. తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకుండా ఐటిఐఆర్ ఇవ్వకుండా,ఇప్పుడు యువతను రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు రాజకీయం చేస్తుందనే విమర్శ ఉంది.
image.png
-డాక్టర్ సంగని మల్లేశ్వర్,
జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్ – 9866255355

Leave a Reply