- ఏం అభివృద్ధి సాధించారో చెప్పండి
- తెలంగాణలో ప్రతిపైసా అప్పుతో అభివృద్ధి
- ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధానిపై మంత్రి కెటిఆర్ విమర్శలు
- దావోస్ సదస్సుకు స్విట్జర్లాండ్ చేరుకున్న మంత్రి
దావోస్, జనవరి 16 : ప్రధానిగా మోడీ ఒక్కరే వంద లక్షల కోట్లు అప్పులు చేశారని, ఈ అప్పులన్నీ ఏ పనికి పెట్టారో ప్రధాని సమాధానం చెప్పాలని మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. స్విట్టర్లాండ్ లోని దావోస్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం స్విట్జర్లాం డ్లోని ఎన్ఆర్ఐల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ అప్పులను ప్రశ్నించే అర్హత బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడుంది? గతంలో 14మంది ప్రధానులు 56లక్షల కోట్లు అప్పులు చేస్తే.. మోడీ ఒక్కరే వంద లక్షల కోట్లు అప్పులు చేశారు. మరి ఆ వంద లక్షల కోట్ల అప్పు ఏ పనికి పెట్టారు? తెలంగాణ చేసే ప్రతీ పైసా అప్పుకు ప్రతిఫలం ఉంటుంది. మరి వంద లక్షల కోట్ల అప్పులతో కేంద్రం ఏ మంచి పని చేసింది. అప్పులు చేసి లాభాలొచ్చే రీతిలో పెట్టుబడి పెడితే తప్పులేదు.
తెలంగాణ అప్పులపై బీజేపీ నానా యాగీ చేస్తుంది. మేం అప్పుచేసినా, ప్రతీపైసా పెట్టిబడి లాభాలతో తిరిగొస్తుంది. లాజిక్లు అర్థం చేసుకో లేని వాళ్లకు ఏం చెప్పగలం’ అంటూ కేటీఆర్ మోడీకి చురకలంటించారు. జనవరి 17 నుంచి 20 వరకు స్విట్జ ర్లాండ్లోనే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే కెటిఆర్ దావోస్ చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు మం త్రులు, ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇండస్టీ రౌండ్టేబుల్స్లో కూడా కేటీఆర్ పాల్గొననున్నారు. తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భేటీలు నిర్వహిం చనున్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్నారైలు కలిసి రావాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ నగరంలో ప్రవాస భారతీయులు జనవరి 15న ఆదివారం నిర్వహించిన వి•ట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులు ఇచ్చే మద్దతు గొప్పగా ఉంటుందని అన్నారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రచారం చేసి, రాష్ట్రానికి పెట్టుబడులు వొచ్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. స్వపరిపాలన కావాలని ఉద్యమం చేశామని, రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, తెలంగాణ సమగ్ర, సవి•కృత, సమ్మిళిత అభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేశామని, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని, హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందని మంత్రి వెల్లడించారు. అంతేకాదు ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తుంటే కొందరు అప్పు, తప్పు అంటున్నారని, భారత దేశ సామాజిక ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేనివాళ్లు పేదలకు ఇచ్చే పథకాలను ఉచిత తాయిలాలు అంటూ హేళన చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. 8 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం చేసింది ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రవాస భారతీయలు పాల్గొన్నారు.