రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చేగుర్ గ్రామంలో నిరసన!
రోజు వారి పనులకు వచ్చే కూలీలు రోజు రెండు సిసలు కల్లు తాగుతున్నరని ఒక్క కల్లు సీసా 15 రూపాయలు అయితే,రెండు సిసలు కలిపి 30 రూపాయలు అవుతుందని రైతులు గ్రామస్థులు ,ఆరోపిస్తూ వినూత్న కార్యక్రమాలు చేపట్టారు గతంలో లాక్ డౌన్ సమయంలో కల్లు ఎక్కువగా దొరక్కపోవడంతో 15 రూపాయలు అమ్మరని అంతకు ముందు 10 రూపాయలు అమ్మే కల్లు ఇప్పుడు 15రూపాయలు అమ్మడంతో గ్రామస్థులు టెంట్ వేసుకొని వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చేగుర్ గ్రామంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు అయితే తెలంగాణ ఏర్పాటు కోసం ప్రజా సమస్యలపై ఎన్నో ధర్నాలు చేయడం నిరసనలు చెయ్యడం వంట వార్పు కార్యక్రమలు చెయ్యడం చూశారు కానీ ప్రస్తుతం కల్లు ధర తగ్గించాలని ధర్నా చెయ్యడం వింత ఘటనగా చూస్తున్నారు జనాలు.