హత్య జరిగిన తీరును తెలుసుకున్న పోలీసులు
హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా అదుపులో ఉన్న నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు మంథని తీసుకెళ్లారు. హత్యకు ముందు రెక్కీ చేసిన ప్రాంతాల్లో సీన్ రీకన్స్టక్ష్ర నిర్వహించారు. హత్యకు ముందు నిందితులు రెక్కీ నిర్వహించిన మంథని కోర్టు ప్రాంగణం, రిజిస్టేష్రన్ కార్యాలయం, అంబేడ్కర్ చౌక్లో పోలీసులు సీన్ రీకన్స్టక్ష్ర నిర్వహించారు. అనంతరం నిందితులను హత్య జరిగిన కల్వచర్లకు తీసుకెళ్లారు. హత్య జరిగిన తీరును కుంట శ్రీను, కుమార్, చిరంజీవి పోలీసులకు వివరించారు.
హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతులను ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద రోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దంపతుల హత్య కేసుకు సంబంధించి బిట్టు శ్రీనుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్య కేసు నిందితులు ఉపయోగించిన ఆయుధాల వెలికితీత ఆపరేషన్ ముగిసింది. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం పెద్దపల్లి జిల్లా సిరిపురం సవి•పంలోని పార్వతీ బ్యారేజీలో 2 రోజులు సుమారు 10 నుంచి 15 వి•టర్ల లోతున్న నీటిలో శ్రమించి రెండు కత్తులను బయటకు తీశారు. ఆదివారం ఆయుధాలు లభ్యం కాకపోవడంతో సోమవారం మళ్లీ ఇద్దరు నిందితులను బ్యారేజీ వద్దకు తీసుకొచ్చారు.
ఓ పక్క డైవర్స్ గాలింపు చేస్తుండగానే, పోలీసులు 3 కిలోల బరువున్న 5 అయస్కాంతాలను తెప్పించారు. స్థానికుల సాయంతో నీటిలో వెతికించారు. సాయంత్రం సమయంలో 53?54వ పిల్లర్ల మధ్యలో రెండు కత్తులను డైవర్లు కనుగొని.. బయటికి తెచ్చారు. ఆ కత్తులను నిందితులకు చూపించగా అవేనని అంగీకరించారు.
పంచనామా నిర్వహించిన తర్వాత కత్తులను రామగుండం పోలీస్ కమిషనరేట్కు తరలించారు. రిమాండ్లో ఉన్న నిందితుడు బిట్టు శ్రీను జ్యుడీషియల్ కస్టడీకి పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు అనుమతి ఇచ్చింది. హత్య కేసులో శ్రీనును గత నెల 22న అరెస్టు చేసిన పోలీసులు 23న అర్ధరాత్రి దాటిన తర్వాత రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో ఏ1, ఏ2, ఏ3 నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్ల ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ గడువు ఈ నెల 4తో ముగుస్తుంది