- పిఎం కేర్స్ నుంచి నిధుల విడుదల
- నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామన్న కిషన్ రెడ్డి
హైదరాబాద్లో టీకా టెస్టింగ్ సెంటర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సెంటర్లో టీకా టెస్టింగ్ ల్యాబొరేటరీకి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నెల రోజుల్లో హైదరాబాద్లో టీకా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు. పీఎం కేర్స్ నిధులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దిల్లీలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు కేవలం రెండు టీకా టెస్టింగ్ కేంద్రాలే ఉన్నాయి. హైదరాబాద్లో మూడో టీకా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. భాగ్యనగరం ఫార్మా, పరిశోధన సంస్థలకు కేంద్రంగా ఉంది. టీకా టెస్టింగ్ కేంద్రం రావడం హైదరాబాద్కు తలమానికం. టీకా టెస్టింగ్ సెంటర్కు అవకాశం కల్పించిన ప్రధానికి కృతజ్ఞతలని కిషన్రెడ్డి అన్నారు. ఇదిలావుంటే హైదరాబాద్లో టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని గతంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కెటిఆర్ కూడా సూచించారు.
నిధులు విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి కృతఙ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లో టీకా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటుతో నగరంలో ఫార్మా రంగం సమగ్ర అభివృద్ధికి మరో పెద్ద అడుగు పడిందని కిషన్ రెడ్డి ట్వీట్ చేసారు. అలానే ఈ ల్యాబొరేటరీ, కోవిడ్ టీకాల ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కొరోనా నేపథ్యంలో హైదరాబాద్తో పాటు పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్లో కూడా కొత్తగా కోవిడ్ టీకా టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతిచ్చింది.
కాగా హైదరాబాద్లో టీకా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ ఇటీవలే కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, సదానంద గౌడలకు లేఖ రాసిన విషయం తెల్సిందే. హైదరాబాద్లో టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తే నెలకి సుమారు 8 నుంచి 10 కోట్ల కోవిడ్ టీకా డోసులను అదనంగా ఉత్పత్తి చేయవొచ్చని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. టీకా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వొస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, హైదరాబాద్ నగరంలో ఉన్న జీనోమ్ వ్యాలీలో టీకా టెస్టింగ్ సెంటర్కి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.