Take a fresh look at your lifestyle.

పట్టణ ప్రజలకు తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలి

సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 8,17 వార్డుల ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సున్నం.గంగా అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మర్లపాటి రేణుక మాట్లాడుతూ భద్రాచలం ఇసుక స్థానిక ప్రజలకు తక్కువ ధరకు అందించాలని తరువాతనే బయట ప్రాంతాలకు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు గ్రామ సభలో చేసిన తీర్మానాన్ని తుంగలో తొక్కి బయటి ప్రాంతాలకు ఎక్కువ ఇసుకను తరలించాలని అధికారులు చూస్తున్నారని,దీనిని వెంటనే విరమించుకోవాలని పట్టణ ప్రజలు బయట ప్రాంతాల నుంచి ఎక్కువ ధరకు ఇసుకను కొనుక్కోవడం ఏమిటని స్థానికంగా ఉన్న ఇసుక ఎందుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లేదని ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలని డిమాండ్‌ ‌చేశారు వర్షాలు బాగా పెరిగి వరదలు రావడం మొదలైన తర్వాత ఇసుక తీయడం ఇబ్బందికరంగా కాబట్టి వెంటనే బయటకు తీసి  ప్రజలకు అందుబాటులోకి  తీసుకురావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో సక్కుబాయ్‌, ‌రాజలింగం,బంటు రామకృష్ణ , నాగమ్మ, సుశీల, సరోజిని,నక్క చిట్టెమ్మ ,వీర్రాజు,రోహిణి,కళావతి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply