Take a fresh look at your lifestyle.

ధాన్యం భాండాగారం అన్న మాట ఏమయ్యింది

  • తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఎందుకీ సమస్య
  • కావాలనే రైతులను గందరగోళం పెడుతున్న కెసిఆర్‌
  • ‌కావాలనే సమస్య సృష్టిస్తున్న టిఆర్‌ఎస్‌ ‌నేతలు
  • రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి

ముఖ్యమంత్రి తెలంగాణను ధాన్య బండాగారాన్ని చేస్తానని అన్నాడని, మరి ఇప్పుడు ఏమి అయిందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి నిలదీశారు. కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నా.. వారిని అదుకోడంలో ప్రభుత్వం వైఫల్యం అయిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ‌కేంద్రాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలు రైతులను గందరగోళంలోకి నెట్టొందన్న ఆయన.. ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి సమస్యా లేదన్నారు. ఎక్కడా లేని సమస్యను టీఆర్‌ఎస్‌ ‌నేతలు సృష్టిస్తున్నారని.. పంటలపై రాష్ట్ర సర్కార్‌ ‌దగ్గర సరైన ప్రణాళిక కూడా లేదని తెలిపారు. గత ఒప్పందాల ప్రకారమే రాష్ట్రం నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రైతులకు వరి విత్తనాలు అందించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. బాయిల్డ్ ‌రైస్‌ ‌విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటన్నారు. ప్రతిదీ కేంద్ర ప్రభుత్వంపై తోసేస్తున్నారని ఆరోపించారు.

ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని ఎక్కడా చెప్పలేదన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. బాయిల్డ్ ‌రైస్‌ ఇవ్వబోమని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. ఈ సీజన్‌లో చివరి బస్తా వరకు కేంద్రం కొంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్‌లో చివరి బస్తా వరకు కేంద్రం కొంటుందన్న కిషన్‌ ‌రెడ్డి.. బాయిల్డ్ ‌రైస్‌ ఇవ్వబోమని స్వయానా సీఎం కేసీఆరే కేంద్రానికి లేఖ ఇచ్చారన్నారు. పుత్రవాత్సల్యం పేరుతో రైతులను బలి చేయవద్దని.. దొడ్డు వడ్లు కాకుండా ఇతర ధాన్యాలు లేవా అని ప్రశ్నించారు. కల్లాల్లో ఉన్న వడ్లన్నీ కొనాలని రైతులు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. తెలంగాణాలో నాసిరకం విత్తనాల అమ్మకాలు జరుగుతున్నా యని..వాటిని అరికట్టలెకపోతున్నారన్నారు.

చాలా మంది కౌలు రైతులు ఆత్మహత్యాలు చేసుకుంటు న్నారన్న కిషన్‌ ‌రెడ్డి..ప్రతి సంవత్సరం మే నెలలో రైతులు ఏ పంట వేయాలో అనే ప్రణాళిక ఉంటది …కానీ ఈ ప్రభుత్వనికి ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. ఒకసారి ఒక్కో మాట మాట్లాడుతారని.. ఒకసారి సన్న బియ్యం ..ఒకసారి పత్తి వేయమంటారని చెప్పారు. హుజూరబాద్‌ ఎన్నికల ఓటమిపై కేసీఆర్‌ ‌కుటుంబానికి సానుభూతి తప్ప మేము ఏమి చేప్పలేమన్నారు. కేంద్రం ప్రతి సంత్సరం ధాన్యం కొనుగొలు చేస్తుందని… బాయిల్‌ ‌రైసు రాకుండా రైతులకు సరైన విత్తనాలు అందుబాటులొ ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. హుజూరబాద్‌ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకొలేక పోతున్నారని.. కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. హుజురాబాద్‌ ఎన్నికల తర్వాత ప్రజల్ని గందరగోళంలోకి గురి చేసి కుట్రకు పాల్పడుతున్నారని తెలిపారు.

Leave a Reply